వెల్టూర్ అభివృద్ధికి ఎమ్మెల్యే మేఘా రెడ్డి హామీ

మండల కేంద్రం అంశంపై సీఎం దృష్టికి ఫైల్ తీసుకెళ్తామని స్పష్టం

వెల్టూర్ అభివృద్ధికి ఎమ్మెల్యే మేఘా రెడ్డి హామీ

పెద్దమందడి,జనవరి25(తెలంగాణ ముచ్చట్లు):

పెద్దమందడి మండలం పరిధిలోని వెల్టూర్ గ్రామ అభివృద్ధి కోసం గ్రామానికి చెందిన కాంగ్రెస్, బీజేపీ నాయకులు ఎమ్మెల్యే మేఘా రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వెల్టూర్ గ్రామానికి సంబంధించిన పలు కీలక అభివృద్ధి సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు.
గ్రామాన్ని మండల కేంద్రంగా ప్రకటిస్తే పరిసర గ్రామాలకు పరిపాలనా సౌకర్యాలు మెరుగుపడతాయని నాయకులు వివరించారు.అలాగే వెల్టూర్ నుంచి సోలిపూర్ వరకు బీటి రోడ్డును విస్తరించి బలపర్చాలని, రవాణా సౌకర్యాల మెరుగుదల కోసం గ్రామ సమీపంలో ఆర్టీసీ బస్టాండ్ ఏర్పాటు చేయాలని కోరారు. గ్రామ ప్రజలకు బ్యాంకింగ్ సౌకర్యాలు అందుబాటులోకి రావాలనే ఉద్దేశంతో మినీ బ్యాంకు ఏర్పాటు చేయాలని కూడా వినతిపత్రం ద్వారా అభ్యర్థించారు.ఈ అన్ని అంశాలపై ఎమ్మెల్యే మేఘా రెడ్డి సానుకూలంగా స్పందించారు. కొత్త మండలాల ఏర్పాటు సంబంధిత ఫైల్‌ను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి తగిన నిర్ణయం తీసుకునేలా కృషి చేస్తామని హామీ ఇచ్చారు. అలాగే రోడ్లు, రవాణా, మౌలిక వసతుల అభివృద్ధికి ప్రభుత్వం తరఫున పూర్తి సహకారం అందిస్తామని తెలిపారు.వెల్టూర్ గ్రామ అభివృద్ధి కోసం అవసరమైన చర్యలు దశలవారీగా చేపడతామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ కాంగ్రెస్ పార్టీ కంటెస్టెడ్ సర్పంచ్ అభ్యర్థి వడ్డె శేఖర్, బిజెపి మాజీ మండల అధ్యక్షుడు రమేష్, తిరుపతయ్య, దాసరి కురుమన్న తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .