న్యాయవాదుల కోసం సెవెన్ రా ఫౌండేషన్ ఉచిత మెగా హెల్త్ క్యాంప్ 

న్యాయవాదుల కోసం సెవెన్ రా ఫౌండేషన్ ఉచిత మెగా హెల్త్ క్యాంప్ 

మల్కాజిగిరి, జనవరి 27 (తెలంగాణ ముచ్చట్లు):

మల్కాజిగిరి బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యాయవాదుల కోసం సెవెన్ రా ఫౌండేషన్ నిర్వహించిన ఉచిత మెగా హెల్త్ క్యాంప్ అభినందనీయమని అసోసియేషన్ నాయకులు ప్రశంసించారు. మంగళవారం కుషాయిగూడ కోర్టు ప్రాంగణంలో సెవెన్ రా ఫౌండేషన్ చైర్మన్, హైకోర్టు న్యాయవాది తిప్పారపు కీర్తి కుమార్ ఆధ్వర్యంలో ఈ ఆరోగ్య శిబిరం నిర్వహించారు.ఈ హెల్త్ క్యాంప్‌లో న్యాయవాదులకు షుగర్, బీపీ, హెచ్‌బీఏ1సీ, దంత పరీక్షలు, కంటి పరీక్షలు వంటి వైద్య పరీక్షలను ఉచితంగా నిర్వహించారు. వందలాది మంది న్యాయవాదులు ఈ శిబిరంలో వైద్య పరీక్షలు చేయించుకున్నారు.
న్యాయవాదుల ఆరోగ్య పరిరక్షణకు సెవెన్ రా ఫౌండేషన్ చేపట్టిన ఈ కార్యక్రమం ప్రశంసనీయమని బార్ అసోసియేషన్ నాయకులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ న్యాయవాదులు బాపిరెడ్డి, అమరేందర్ రెడ్డి, రాజభక్షి శ్రీనివాస్, అరుణ్ చంద్ర, కే. శ్రావణ్, శివ తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .