బీజేపీ సీనియర్ నాయకుడు రాజేశ్వర్ రావుకు ఘన నివాళి

బీజేపీ సీనియర్ నాయకుడు రాజేశ్వర్ రావుకు ఘన నివాళి

ఎల్కతుర్తి, జనవరి 27: (తెలంగాణ ముచ్చట్లు)

ఎల్కతుర్తి మండలం దామెర గ్రామానికి చెందిన భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ గ్రామ శక్తి కేంద్రం ఇన్‌చార్జ్, మాజీ గ్రామ సర్పంచ్ సోలంకి రాజేశ్వర్ రావు గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ ఇటీవల కన్నుమూశారు. ఆయన మృతితో గ్రామంలోనే కాకుండా బీజేపీ శ్రేణుల్లో తీవ్ర విషాదం నెలకొంది.
ఈ సందర్భంగా ఎల్కతుర్తి బీజేపీ మండల అధ్యక్షుడు మంతుర్తి శ్రీకాంత్ నేతృత్వంలో బీజేపీ రాష్ట్ర బీసీ మోర్చా కార్యదర్శి ఎర్రగోల్ల శ్రీనివాస్, మండల పార్టీ నాయకులు, కార్యకర్తలు రాజేశ్వర్ రావు పార్థివ దేహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
నాయకులు మాట్లాడుతూ, గ్రామాభివృద్ధి మరియు ప్రజాసేవ రంగాల్లో సోలంకి రాజేశ్వర్ రావు చేసిన సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు. పార్టీ పట్ల ఆయన చూపిన అంకితభావం, సేవా దృక్పథం యువ నాయకులకు స్ఫూర్తిదాయకమని అన్నారు. ఆయన అకాల మరణం పార్టీకి, గ్రామానికి తీరని లోటని అన్నారు.
ఈ దుఃఖ సమయంలో పార్టీ తరఫున రాజేశ్వర్ రావు కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .