పెద్దమందడి  ఎస్సై జలంధర్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన బీజేపీ నాయకులు

పెద్దమందడి  ఎస్సై జలంధర్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన బీజేపీ నాయకులు

పెద్దమందడి,జనవరి19(తెలంగాణ ముచ్చట్లు):

పెద్దమందడి మండలానికి నూతనంగా నియమితులైన ఎస్సై జలంధర్ రెడ్డి ని బీజేపీ పార్టీ నాయకులు సోమవారం మర్యాదపూర్వకంగా  కలిశారు. ఈ సందర్భంగా మండలంలో శాంతి భద్రతల పరిరక్షణకు తీసుకునే చర్యలకు తమ పూర్తి సహకారం ఉంటుందని తెలిపారు. అలాగే బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా ఎస్సై జలంధర్ రెడ్డిని శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో బీజేపీ పార్టీ మండల అధ్యక్షుడు ముప్పూరి చెన్నయ్య, జిల్లా కార్యవర్గ సభ్యుడు తిరుపతయ్య, జిల్లా కౌన్సిల్ నెంబర్ రామ్ నరేష్ యాదవ్ పాల్గొన్నారు. ప్రజల భద్రత, శాంతియుత వాతావరణం కోసం పోలీసు శాఖతో సమన్వయంగా పనిచేయాల్సిన అవసరం ఉందని నాయకులు ఈ సందర్భంగా పేర్కొన్నారు.నూతన ఎస్సై జలంధర్ రెడ్డి  మాట్లాడుతూ.. మండలంలో చట్టసువ్యవస్థలను కట్టుదిట్టంగా అమలు చేస్తూ ప్రజలకు అందుబాటులో ఉంటానని, ప్రజాప్రతినిధుల సహకారంతో శాంతి భద్రతలు మరింత బలోపేతం చేస్తామని తెలిపారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

పెద్దమందడిలో ప్రెస్ క్లబ్ భవనానికి స్థల పరిశీలన పెద్దమందడిలో ప్రెస్ క్లబ్ భవనానికి స్థల పరిశీలన
పెద్దమందడి,జనవరి27(తెలంగాణ ముచ్చట్లు): పెద్దమందడి మండల కేంద్రంలో ప్రెస్ క్లబ్ భవన నిర్మాణం కోసం మంగళవారం స్థల పరిశీలన చేపట్టినట్లు ప్రెస్ క్లబ్ అధ్యక్షులు ఎం. ఈశ్వర్ తెలిపారు....
పేద కుటుంబానికి అండగా ముఖ్యమంత్రి సహాయ నిధి
పారదర్శకంగా మునిసిపల్ ఎన్నికల నిర్వహణ.. 
జిల్లా ఎస్పీని మర్యాదపూర్వకంగా కలిసిన వెల్టూర్ గ్రామ నాయకులు
కీసరలో ‘అరైవ్ అలైవ్–2026’ రోడ్డు భద్రతా అవగాహన కార్యక్రమం
వాజపేయి నగర్ రైల్వే అండర్ బ్రిడ్జి, సఫిల్‌గూడ సబ్‌వే పనులకు శంకుస్థాపన
పామాయిల్ తోటల్లో పసుపు సాగు విజయవంతం.!