పెద్దమందడి  ఎస్సై జలంధర్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన బీజేపీ నాయకులు

పెద్దమందడి  ఎస్సై జలంధర్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన బీజేపీ నాయకులు

పెద్దమందడి,జనవరి19(తెలంగాణ ముచ్చట్లు):

పెద్దమందడి మండలానికి నూతనంగా నియమితులైన ఎస్సై జలంధర్ రెడ్డి ని బీజేపీ పార్టీ నాయకులు సోమవారం మర్యాదపూర్వకంగా  కలిశారు. ఈ సందర్భంగా మండలంలో శాంతి భద్రతల పరిరక్షణకు తీసుకునే చర్యలకు తమ పూర్తి సహకారం ఉంటుందని తెలిపారు. అలాగే బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా ఎస్సై జలంధర్ రెడ్డిని శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో బీజేపీ పార్టీ మండల అధ్యక్షుడు ముప్పూరి చెన్నయ్య, జిల్లా కార్యవర్గ సభ్యుడు తిరుపతయ్య, జిల్లా కౌన్సిల్ నెంబర్ రామ్ నరేష్ యాదవ్ పాల్గొన్నారు. ప్రజల భద్రత, శాంతియుత వాతావరణం కోసం పోలీసు శాఖతో సమన్వయంగా పనిచేయాల్సిన అవసరం ఉందని నాయకులు ఈ సందర్భంగా పేర్కొన్నారు.నూతన ఎస్సై జలంధర్ రెడ్డి  మాట్లాడుతూ.. మండలంలో చట్టసువ్యవస్థలను కట్టుదిట్టంగా అమలు చేస్తూ ప్రజలకు అందుబాటులో ఉంటానని, ప్రజాప్రతినిధుల సహకారంతో శాంతి భద్రతలు మరింత బలోపేతం చేస్తామని తెలిపారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .