పామాయిల్ తోటల్లో పసుపు సాగు విజయవంతం.!

మంత్రి తుమ్మల ప్రయోగానికి మంచి ఫలితం.

పామాయిల్ తోటల్లో పసుపు సాగు విజయవంతం.!

అశ్వారావుపేట, జనవరి 27 (తెలంగాణ ముచ్చట్లు):

దమ్మపేట మండలం, లింగాలపల్లి గ్రామంలో పామాయిల్ తోటల్లో అంతర పంటగా పసుపు సాగు విజయవంతమైంది. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తన స్వంత వ్యవసాయ క్షేత్రంలో చేపట్టిన ప్రయోగాత్మక సాగు మంచి ఫలితాలను ఇస్తోంది.
సాధారణంగా ఈ ప్రాంతంలో పామాయిల్ సాగు ప్రారంభ దశలో వేరుశెనగ, మొక్కజొన్న వంటి పంటలను రైతులు అంతర పంటలుగా సాగు చేస్తున్నారు. అయితే పసుపుకు ఉన్న మార్కెట్ గిరాకీని దృష్టిలో పెట్టుకుని, ఈ ప్రాంత వాతావరణ పరిస్థితులు పసుపు సాగుకు అనుకూలమా అనే అంశాన్ని తెలుసుకునేందుకు మంత్రి ఈ ప్రయోగం చేపట్టారు.
తాజాగా పసుపు దుంపలను పరిశీలించిన మంత్రి, దుంపలు బాగా ఊరడంతో పాటు నాణ్యంగా ఉన్నాయని తెలిపారు. పామాయిల్ తోటల్లో అంతర పంటగా పసుపు సాగు చేస్తే రైతులకు అదనంగా లక్షల్లో ఆదాయం వచ్చే అవకాశముందని ఈ ప్రయోగం ద్వారా స్పష్టమైంది.
రైతులకు భరోసా కల్పించేలా మంత్రి స్వయంగా సాగు చేసి చూపడం పట్ల స్థానిక రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .