హక్కుల కోసం పోరాడేది కమ్యూనిస్టులే
ఆటో ర్యాలీని ప్రారంభించిన సిపిఐ నేత ప్రకాష్బాబు
ఖమ్మం బ్యూరో, జనవరి 16(తెలంగాణ ముచ్చట్లు)
కార్మిక హక్కులు, సంక్షేమం కోసం పోరాడేది కమ్యూనిస్టులేనని సిపిఐ జాతీయ కార్యదర్శి ప్రకాష్బాబు తెలిపారు. శుక్రవారం శ్రీశ్రీ సెంటర్లో శతాబ్ది ఉత్సవాల ముగింపు బహిరంగ సభ ప్రచారంలో భాగంగా ఆటో ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రకాష్బాబు మాట్లాడుతూ అసంఘటిత కార్మికుల శ్రమకు తగిన వేతనం లభించడం లేదన్నారు. శ్రమకు తగినవిధంగా వేతనం లభించే చర్యలు తీసుకోవడంలో పాలకులు విఫలమయ్యారని ప్రకాష్బాబు ఆరోపించారు. మోడీ తెచ్చిన లేబర్ కోడ్లు కార్మికుల హక్కులు హరించబడుతున్నాయని భవిష్యత్తులో కార్మిక వర్గం మరిన్ని క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొవాల్సి వస్తుందని యావత్ కార్మిక లోకం భవిష్యత్తు పోరాటాలకు సంసిద్దులు కావాలన్నారు. ఆటో ర్యాలీ శ్రీశ్రీ విగ్రహం వద్ద ప్రారంభమై నగరంలోని అన్ని ప్రధాన వీధుల్లో సాగింది. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి జమ్ముల జితేందర్రెడ్డి, నగర కార్యదర్శి ఎస్ కె జానిమియా, ఏఐటియుసి జిల్లా కార్యదర్శి టి. రామాంజనేయులు, హవేలి ఏరియా సిపిఐ కార్యదర్శి ఏనుగు గాంధీ, ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి నానబాల రామకృష్ణ, ఆటో వర్కర్స్ యూనియన్ నాయకులు పి. మోహన్రావు, శ్రీనివాసరావు, జాకీర్, ఆముదాల వెంకన్న, ఉపేందర్ తదితరులు పాల్గొన్నారు.


Comments