అండర్గ్రౌండ్ డ్రైనేజీ పనులను పరిశీలించిన కార్పొరేటర్ ప్రభుదాస్
నాచారం, ఫిబ్రవరి 04 (తెలంగాణ ముచ్చట్లు)
ఉప్పల్ నియోజకవర్గం నాచారం సర్కిల్ మీర్పేట్ హెచ్బీ కాలనీ డివిజన్ పరిధిలోని హెచ్బీ కాలనీ ఫేజ్–1 ఓం శాంతి బిల్డింగ్ గల్లీలో చేపట్టిన అండర్గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణ పనులను స్థానిక కార్పొరేటర్ జెరిపోతుల ప్రభుదాస్ పరిశీలించారు.ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ, డివిజన్ అభివృద్ధే తమ ప్రధాన లక్ష్యమని, ప్రజల సమస్యల పరిష్కారానికి ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ అవసరమైన సహకారం అందిస్తామని తెలిపారు. కాలనీలో మౌలిక సదుపాయాల అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తామని హామీ ఇచ్చారు. డివిజన్ అభివృద్ధికి సహకరిస్తున్న ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి కి, అలాగే డివిజన్ నాయకులకు కార్పొరేటర్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో వాటర్ వర్క్స్ అధికారి వేణుగోపాల్, కాలనీ అధ్యక్షుడు శివరాం ప్రసాద్, గోవింద రెడ్డి, చారి, శేఖర్ గౌడ్తో పాటు కాలనీ నాయకులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.


Comments