అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ పనులను పరిశీలించిన కార్పొరేటర్ ప్రభుదాస్

అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ పనులను పరిశీలించిన కార్పొరేటర్ ప్రభుదాస్

నాచారం, ఫిబ్రవరి 04 (తెలంగాణ ముచ్చట్లు)

ఉప్పల్ నియోజకవర్గం నాచారం సర్కిల్ మీర్పేట్ హెచ్‌బీ కాలనీ డివిజన్ పరిధిలోని హెచ్‌బీ కాలనీ ఫేజ్–1 ఓం శాంతి బిల్డింగ్ గల్లీలో చేపట్టిన అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణ పనులను స్థానిక కార్పొరేటర్ జెరిపోతుల ప్రభుదాస్ పరిశీలించారు.ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ, డివిజన్ అభివృద్ధే తమ ప్రధాన లక్ష్యమని, ప్రజల సమస్యల పరిష్కారానికి ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ అవసరమైన సహకారం అందిస్తామని తెలిపారు. కాలనీలో మౌలిక సదుపాయాల అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తామని హామీ ఇచ్చారు. డివిజన్ అభివృద్ధికి సహకరిస్తున్న ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి కి, అలాగే డివిజన్ నాయకులకు కార్పొరేటర్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో వాటర్ వర్క్స్ అధికారి వేణుగోపాల్, కాలనీ అధ్యక్షుడు శివరాం ప్రసాద్, గోవింద రెడ్డి, చారి, శేఖర్ గౌడ్‌తో పాటు కాలనీ నాయకులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

కాంగ్రెస్ ప్రభుత్వంతోనే అభివృద్ధి సాధ్యం కాంగ్రెస్ ప్రభుత్వంతోనే అభివృద్ధి సాధ్యం
వనపర్తి,ఫిబ్రవరి4(తెలంగాణ ముచ్చట్లు): రానున్న మరో ఎనిమిది సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీనే అధికారంలో ఉంటుందని, నిరుపేదలందరికీ సంక్షేమ ఫలాలు అందిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని వనపర్తి...
ఎస్సీ విద్యార్థుల ప్రీ మెట్రిక్ స్కాలర్‌ షిప్ నమోదు వేగవంతం చేయాలి
నితిన్ నబిన్ బహిరంగ సభకు బయలుదేరిన పెద్దమందడి బీజేపీ నాయకులు
వ్యవసాయ రంగాన్ని సంక్షోభం నుంచి బయటపడేయాలి
మనిగిల్ల ప్రభుత్వ పాఠశాలలో వార్షికోత్సవాలపై చర్చ
ఎల్లంపేట్‌లో అక్రమ మద్యం స్వాధీనం
6వ వార్డులో బీజేపీ ప్రచార హోరు.