అక్షరం నూతన సంవత్సర క్యాలెండర్ ను ఆవిష్కరించిన....తుంబూరు దయాకర్ రెడ్డి
ఖమ్మం బ్యూరో, ఫిబ్రవరి 2 (తెలంగాణ ముచ్చట్లు)
సమాజహితం పనిచేస్తూ పత్రికా రంగంలో దినదిన అభివృద్ధి చెందుతున్న అక్షరం న్యూస్ నూతన సంవత్సర క్యాలెండర్ ను మంత్రి పొంగులేటి క్యాంపు కార్యాలయ ఇన్ చార్జి తుంబూరు దయాకర్ రెడ్డి
సోమవారం ఖమ్మం లో ప్రారంభించారు. అక్షరం న్యూస్ జిల్లా స్టాపర్ దేవబత్తిని సీతారాములు ఆధ్వర్యంలో రూపొందించిన ఈ క్యాలెండర్ ను ఆయన చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాజానికి నాలుగో స్తంభంగా ఉన్న మీడియా అన్ని రంగాల్లో రాణించడం అభినందనీయం అన్నారు. సుదీర్ఘ కాలం పాటు ప్రభుత్వానికి, ప్రజలకు వారధిగా నిలుస్తున్న అక్షరం న్యూస్ దినపత్రిక భవిష్యత్తులో అంచెలంచెలుగా ఎదగాలని ఆకాంక్షించారు. అనంతరం ఆయనకు సీతారాములు జర్నలిస్టులు శాలువా కప్పి సన్మానించి సత్కరించారు. ఈ కార్యక్రమంలో జర్నలిస్ట్ గోవింద చారి, పలువురు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు అభిమానులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.


Comments