ప్రజాయుద్ధనౌక గద్దర్ జయంతి వేడుకలు
కీసర, ఫిబ్రవరి 01(తెలంగాణ ముచ్చట్లు)
తెలంగాణ ఉద్యమానికి ఊపిరిపోసి, ప్రజల్లో చైతన్యం రగిలించిన ప్రజాయుద్ధనౌక గద్దర్ జయంతిని సందర్భంగా ఆయనకు ఘనంగా నివాళులు అర్పించారు. పోరాట తత్వం, దిక్కర వ్యక్తిత్వం, కదం తొక్కిన కలం, అలుపెరుగని గళంతో అణగారిన వర్గాల ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచిన గద్దర్ సేవలను ఈ సందర్భంగా నేతలు స్మరించుకున్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు సైదులు మాట్లాడుతూ… గద్దర్ జీవితం మొత్తం ప్రజల పక్షానే సాగిందని, తెలంగాణ అస్తిత్వ పోరాటానికి ఆయన పాటలు, ప్రసంగాలు దిశానిర్దేశం చేశాయని అన్నారు. అణచివేతకు వ్యతిరేకంగా ఆయన సాగించిన పోరాటం నేటి తరాలకు స్ఫూర్తిగా నిలుస్తుందని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో మాదిగ జాగృతి మండల అధ్యక్షులు కొమ్ము రవి, ఎంఆర్పిఎస్ చీర్యాల గ్రామ అధ్యక్షులు బండారి నర్సింగరావు, ప్రధాన కార్యదర్శి బోడ వెంకటేష్, యువనాయకులు బత్తుల రామచందర్, సందాని ఆనంద్, వార్డు సభ్యులు కనకయ్య, కీసర మండల మాజీ సంయుక్త కార్యదర్శి కంచమీది సంతోష్, కట్ట శంకరయ్య, కత్తి గణేష్, మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏలూరి శ్రీనివాస్ ముదిరాజ్, బక్కని కుమార్–జె.కే తదితరులు పాల్గొన్నారు.


Comments