స్వచ్ఛ సర్వేక్షన్‌లో భాగంగా కుషాయిగూడలో స్పెషల్ శానిటేషన్ డ్రైవ్

స్వచ్ఛ సర్వేక్షన్‌లో భాగంగా కుషాయిగూడలో స్పెషల్ శానిటేషన్ డ్రైవ్

కాప్రా, జనవరి 20 (తెలంగాణ ముచ్చట్లు):

స్వచ్ఛ సర్వేక్షన్ ప్రత్యేక కార్యక్రమంలో భాగంగా ఆరుబయట మలమూత్ర విసర్జన చేసే వారు, చెత్తాచెదారాన్ని రోడ్లపై విచ్చలవిడిగా పడేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులు ఆదేశించారు. ఈ నేపథ్యంలో కుషాయిగూడ ప్రాంతంలోని డీ–మార్ట్ ఓపెన్ ఏరియా పరిధిలో ప్రత్యేక శానిటేషన్ డ్రైవ్ నిర్వహించారు.ఈ స్పెషల్ డ్రైవ్‌లో భాగంగా ఆరుబయట మూత్ర విసర్జన చేసిన వారికి పెనాల్టీలు విధించారు. ఈ కార్యక్రమంలో కాప్రా సర్కిల్ డిప్యూటీ కమిషనర్ శ్రీహరి, డీ–సాలిడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్ అధికారి రవి, సానిటరీ సూపర్వైజర్ సుదర్శన్, ఎస్‌ఎఫ్‌ఏ కే.లక్ష్మి, పారిశుద్ధ్య సిబ్బంది పాల్గొన్నారు.నిబంధనలు ఉల్లంఘించిన వారికి పెనాల్టీ విధించడమే కాకుండా, పూలదండ వేసి పుష్పగుచ్ఛాన్ని అందజేసి ప్రజల్లో అవగాహన కల్పించే విధంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆరుబయట మలమూత్ర విసర్జన వల్ల ప్రజారోగ్యానికి కలిగే అనర్థాలు, పరిసరాల కాలుష్యం గురించి ప్రజలకు వివరించామని డిప్యూటీ కమిషనర్ శ్రీహరి తెలిపారు.
ప్రజలు స్వచ్ఛత నిబంధనలు పాటిస్తూ పరిసరాలను శుభ్రంగా ఉంచేందుకు సహకరించాలని ఆయన కోరారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .