బండాచెరువు వాకర్స్ పార్క్ అభివృద్ధి పనులకు శ్రీకారం

బండాచెరువు వాకర్స్ పార్క్ అభివృద్ధి పనులకు శ్రీకారం

వినాయక్‌నగర్, జనవరి 20 (తెలంగాణ ముచ్చట్లు):

బండాచెరువు వాకర్స్ పార్కులో రూ.16 లక్షల రూపాయల వ్యయంతో చేపట్టనున్న వివిధ అభివృద్ధి పనులకు వినాయక్‌నగర్ కార్పొరేటర్ క్యానం రాజ్యలక్ష్మి శుభారంభం చేశారు.ఈ అభివృద్ధి పనుల్లో పార్కులో ర్యాంప్ నిర్మాణం, మెట్లు, చెరువులోకి దిగేందుకు ప్రత్యేక మెట్లు, పార్కింగ్ స్థలం ఏర్పాటు, ఆర్చ్ నిర్మాణంతో పాటు ఇతర సౌకర్యాల అభివృద్ధి ఉన్నాయి. ఈ పనులు పూర్తయ్యే సరికి వాకర్లకు మరింత సౌకర్యవంతమైన వాతావరణం ఏర్పడనుందని కార్పొరేటర్ తెలిపారు.
ఈ కార్యక్రమంలో లాల్వాని నగర్ కాలనీ అధ్యక్షుడు నరేష్, అసోసియేషన్ సభ్యులు ప్రేమ్ కుమార్, గోపాల్ యాదవ్, బీజేపీ సీనియర్ నాయకులు ఆనంద్ గౌళికర్, ఓం ప్రకాష్, సంతోష్, బీజేపీ నాయకులు జగదీష్ చారి, సాయి సురేష్, గోపాల్, ఉమా కాంత్ పాల్గొన్నారు.అలాగే ఇంజినీరింగ్ విభాగం ఏఈ నవీన్ కుమార్, సూపర్‌వైజర్లు సాగర్, వెంకటేష్, హార్టికల్చర్ సూపర్‌వైజర్ వెంకటేష్ హాజరై పనుల వివరాలను పరిశీలించారు.స్థానిక ప్రజలు ఈ అభివృద్ధి పనులు త్వరగా పూర్తిచేసి పార్కును మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దాలని కోరారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .