లోకవరం గ్రామ వాసికి రూ.2.50 లక్షల వైద్య సహాయం.
- పొంగులేటి సిఫారసుతో టీజీఐడిసి చైర్మన్ మువ్వా విజయబాబు చేతుల మీదుగా మంజూరు పత్రం.
సత్తుపల్లి, జనవరి 10 (తెలంగాణ ముచ్చట్లు):
కల్లూరు మండలం లోకవరం గ్రామానికి చెందిన నున్నా మణి (భర్త: నున్నా కృష్ణయ్య) అత్యవసర వైద్య చికిత్స నిమిత్తం మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సిఫారసుతో, టీజీఐడిసి చైర్మన్ మువ్వా విజయబాబు చొరవతో రాష్ట్ర ప్రభుత్వం రూ.2.50 లక్షల వైద్య సహాయ పత్రాన్ని మంజూరు చేసింది. ఈ సందర్భంగా మంజూరు పత్రాన్ని మువ్వా విజయబాబు బాధితురాలికి అందజేశారు. హైదరాబాద్లోని నిజాం వైద్య విజ్ఞాన సంస్థలో కొనసాగుతున్న చికిత్స విజయవంతంగా పూర్తై, ఆమె త్వరగా కోలుకొని సంపూర్ణ ఆరోగ్యంతో ఇంటికి చేరాలని ఆకాంక్షించారు. బాధితురాలి పరిస్థితిని తెలుసుకుని వెంటనే స్పందించి వైద్య సహాయం మంజూరు చేయించి, ఆర్థికంగా అండగా నిలిచినందుకు మువ్వా విజయబాబుకు బాధితురాలి కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి మరియు మువ్వా విజయబాబు అభిమానులు పాల్గొన్నారు.


Comments