నూతన ఎస్సై జలంధర్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన కాంగ్రెస్ నాయకులు నత్తి మన్నెం

నూతన ఎస్సై జలంధర్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన కాంగ్రెస్ నాయకులు నత్తి మన్నెం

పెద్దమందడి,జనవరి10(తెలంగాణ ముచ్చట్లు):

పెద్దమందడి నూతన ఎస్సైగా బాధ్యతలు చేపట్టిన జలంధర్ రెడ్డిని మద్దిగట్ల గ్రామ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు నత్తి మన్నెం శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ సందర్భంగా శాలువాతో సన్మానించి ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తూ, మండలంలో శాంతిభద్రతల పరిరక్షణకు తమ వంతు సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు.ప్రజా సమస్యల పరిష్కారంలో పోలీస్ శాఖతో సమన్వయంగా పనిచేయాల్సిన అవసరం ఉందని కాంగ్రెస్ నాయకులు మన్నెం పేర్కొన్నారు. గ్రామాల్లో శాంతియుత వాతావరణం నెలకొనాలంటే ప్రజలు, పోలీసుల మధ్య సమన్వయం మరింత బలపడాలని అభిప్రాయపడ్డారు.నూతన ఎస్సై జలంధర్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రజల భద్రతే తన ప్రధాన లక్ష్యమని, చట్టానికి వ్యతిరేకంగా వ్యవహరించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.ప్రజాప్రతినిధులు, నాయకుల సహకారంతో మండలంలో శాంతిభద్రతలు మరింత పటిష్టం చేస్తామని తెలిపారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

ఏకశిలా నగర్ భూవివాదంపై ఈటల రాజేందర్ ఘాటు విమర్శలు ఏకశిలా నగర్ భూవివాదంపై ఈటల రాజేందర్ ఘాటు విమర్శలు
ల్యాండ్ మాఫియా–అధికారుల కుమ్మక్కు తక్షణమే ఆపాలి 24 గంటల్లో అరెస్టులు లేకపోతే ఉద్యమం ఉధృతం మేడ్చల్–మల్కాజ్గిరి , జనవరి 11 (తెలంగాణ ముచ్చట్లు)  మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా...
రఘు నాథపాలెం మండలం వర ప్రదాయిని  మంచుకొండ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్
జర్న‌లిస్టుల‌కు ప్రభుత్వం అండగా ఉంటుంది
కొండా గోపి పుట్టినరోజు సందర్భంగా నాగులవంచలో రక్తదాన శిబిరం..
శ్రీ గ్లోబల్ హై స్కూల్ నాగులవంచలో ఘనంగా సంక్రాంతి సంబరాలు..
పాత్రికేయ విలువలకు నిలువెత్తు ప్రతీక  టీ.కే. లక్ష్మణ రావు
మీ నమ్మకాన్ని వొమ్ము చేయడం లేదు