పోలీస్ కమిషనరేట్‌లో పదవీ విరమణ పొందిన సబ్‌ ఇన్‌స్పెక్టర్లకు ఘన సన్మానం

పోలీస్ కమిషనరేట్‌లో పదవీ విరమణ పొందిన సబ్‌ ఇన్‌స్పెక్టర్లకు ఘన సన్మానం

మల్కాజిగిరి, డిసెంబర్ 31 (తెలంగాణ ముచ్చట్లు):

మల్కాజిగిరి పోలీస్ కమిషనరేట్‌లో విధులు నిర్వహిస్తూ పదవీ విరమణ పొందుతున్న సబ్‌ ఇన్‌స్పెక్టర్లు పీఎం కృష్ణారావు (భువనగిరి క్రైమ్ స్టేషన్), వి. నరసింహ (షీ టీమ్) మరియు హోమ్ గార్డ్ జంగయ్యలకు మల్కాజిగిరి పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో ఘనంగా సన్మాన కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా డీసీపీ అడ్మిన్ ఇందిరా మాట్లాడుతూ, పోలీసు ఉద్యోగం అనేది ఎన్నో సవాళ్లు, ఒడిదుడుకులతో కూడుకున్నదని తెలిపారు. అటువంటి పరిస్థితుల్లో దీర్ఘకాలం పాటు క్రమశిక్షణతో, సమర్థవంతంగా విధులు నిర్వహించి పోలీస్ శాఖకు విశేష సేవలు అందించినందుకు పదవీ విరమణ పొందిన అధికారులను ఆమె అభినందించారు.పదవీ విరమణ అనంతరం విశ్రాంత జీవితాన్ని ప్రశాంతంగా గడపాలని, ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. అలాగే పెన్షన్ తదితర ఆర్థిక అంశాల్లో క్రమశిక్షణ పాటించాలని తెలిపారు. వారికి రావాల్సిన అన్ని రకాల ప్రయోజనాలు త్వరితగతిన అందేలా తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.ఈ కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ అడ్మిన్ శివకుమార్, చీఫ్ అకౌంట్స్ ఆఫీసర్ శ్రీనివాస్, పోలీస్ అధికారుల సంఘం అధ్యక్షులు సిహెచ్. భద్రా రెడ్డి, కో-ఆపరేటివ్ ఏఓ ప్రదీప్, కో-ఆపరేటివ్ డైరెక్టర్ రవీంద్ర రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

భారతదేశం అభివృద్ధి చెందిన దేశంగా మారాలంటే సైన్స్ కీలకం భారతదేశం అభివృద్ధి చెందిన దేశంగా మారాలంటే సైన్స్ కీలకం
వనపర్తి,జనవరి4(తెలంగాణ ముచ్చట్లు): భారతదేశం అభివృద్ధి చెందిన దేశంగా ఎదగాలంటే సైన్స్ ఒక్కటే ప్రధాన ఆధారమని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు డాక్టర్ జిల్లెల చిన్నారెడ్డి అన్నారు. వనపర్తి...
వెనిజులాపై అమెరికా సామ్రాజ్యవాద దాడులను ఖండిస్తూ సీపీఎం ర్యాలీ
జమ్మిగడ్డలో బిఆర్‌ఎస్ నాయకురాలు శేరి మణెమ్మ సేవా కార్యక్రమం
మున్నూరు కాపులు ఐక్యతతో కలిసికట్టుగా ముందుకుసాగాలి  పుట్ట పురుషోత్తం రావు
పెద్ద చెరువుకట్టపై శుభ్రత పనులను పరిశీలిం చిన కార్పొరేటర్ శాంతి సాయిజెన్ శేఖర్
అభివృద్ధే శ్వాసగా పనిచేయండి
పదేళ్లలో పేదోడికి గూడు ఇవ్వని దౌర్భాగ్య ప్రభుత్వం