మధర్ తెరిస్సా టెక్నో స్కూల్‌లో సంక్రాంతి సంబరాలు.!

పాఠశాల చిన్నారులతో కలిసి వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే మట్టా రాగమయి.

మధర్ తెరిస్సా టెక్నో స్కూల్‌లో సంక్రాంతి సంబరాలు.!


IMG-20260110-WA0040

సత్తుపల్లి,జనవరి10(తెలంగాణ ముచ్చట్లు): సత్తుపల్లి పట్టణంలోని మధర్ తెరిస్సా టెక్నో స్కూల్‌లో శనివారం సంక్రాంతి సంబరాలు ఉత్సాహంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సత్తుపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు మట్టా రాగమయి పాల్గొని పాఠశాల చిన్నారులతో కలిసి పండుగ వేడుకల్లో సందడి చేశారు. ఈ సందర్భంగా నియోజకవర్గ ప్రజలకు, విద్యార్థులకు ముందస్తుగా సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. విద్యార్థులతో కలిసి బోగి మంటల వద్ద ఆటలు, పాటల కార్యక్రమాల్లో పాల్గొని, చిన్నారులతో కోలాటం ఆడారు. హరిదాస్ వేషధారణలో ఉన్న చిన్నారులను అభినందించి వారి ప్రతిభను ప్రశంసించారు.
ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని, నియోజకవర్గంలోని విద్యార్థులు చదువులో ముందుండాలని ఆకాంక్షించారు. సంక్రాంతి సెలవుల్లో పిల్లలను జాగ్రత్తగా చూసుకోవాలని తల్లిదండ్రులకు సూచించారు. అలాగే ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థల యాజమాన్యాలు, ప్రిన్సిపాళ్లు, ఉపాధ్యాయులు, సిబ్బందికి ప్రత్యేకంగా సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

ఏకశిలా నగర్ భూవివాదంపై ఈటల రాజేందర్ ఘాటు విమర్శలు ఏకశిలా నగర్ భూవివాదంపై ఈటల రాజేందర్ ఘాటు విమర్శలు
ల్యాండ్ మాఫియా–అధికారుల కుమ్మక్కు తక్షణమే ఆపాలి 24 గంటల్లో అరెస్టులు లేకపోతే ఉద్యమం ఉధృతం మేడ్చల్–మల్కాజ్గిరి , జనవరి 11 (తెలంగాణ ముచ్చట్లు)  మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా...
రఘు నాథపాలెం మండలం వర ప్రదాయిని  మంచుకొండ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్
జర్న‌లిస్టుల‌కు ప్రభుత్వం అండగా ఉంటుంది
కొండా గోపి పుట్టినరోజు సందర్భంగా నాగులవంచలో రక్తదాన శిబిరం..
శ్రీ గ్లోబల్ హై స్కూల్ నాగులవంచలో ఘనంగా సంక్రాంతి సంబరాలు..
పాత్రికేయ విలువలకు నిలువెత్తు ప్రతీక  టీ.కే. లక్ష్మణ రావు
మీ నమ్మకాన్ని వొమ్ము చేయడం లేదు