చిన్నారులకు పతంగుల పంపిణీ
మల్లాపూర్లో భోగి పండుగ సందడి
మల్లాపూర్, జనవరి 10 (తెలంగాణ ముచ్చట్లు):
ఉప్పల్ నియోజకవర్గం మల్లాపూర్ పరిధిలోని ఓల్డ్ మల్లాపూర్ సూర్యానగర్ కాలనీ వద్ద భోగి పండుగను పురస్కరించుకుని చిన్నారులకు పతంగుల పంపిణీ కార్యక్రమాన్ని . ఎస్వీ చంద్రయ్య సేవా సమితి ఆధ్వర్యంలో ఫౌండర్ ఎస్వీ కిట్టు కాంగ్రెస్ నాయకులు చిన్నారులకు పతంగులు పంపిణీ చేసి, అనంతరం యువకులతో కలిసి గాలిపటాలు ఎగురవేస్తూ పండుగ ఆనందాన్ని పంచుకున్నారు.ఈ కార్యక్రమంతో ప్రాంతమంతా పండుగ వాతావరణం నెలకొనగా, చిన్నారుల ముఖాల్లో ఆనందం వెల్లివిరిసింది.సమాజంలో ఐక్యత, సేవా భావనను పెంపొందించాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు నిర్వాహకులు తెలిపారు. భోగి పండుగ సందర్భంగా పిల్లలకు ఆనందాన్ని పంచడం ఎంతో సంతోషంగా ఉందని వారు పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో , ఫిరోజ్ ఖాన్, యాది రెడ్డి, రాంప్రసాద్, హరిష్, రవీందర్, రాకేష్ తదితరులు పాల్గొని చిన్నారులకు పతంగులు అందజేశారు.భవిష్యత్తులోనూ ఇలాంటి సేవా కార్యక్రమాలు కొనసాగిస్తామని నిర్వాహకులు తెలిపారు.


Comments