జోనల్ కమిషనర్ రాధిక గుప్తాను మర్యాద పూర్వకంగా కలిసిన బీఆర్‌ఎస్ నేతలు

జోనల్ కమిషనర్ రాధిక గుప్తాను మర్యాద పూర్వకంగా కలిసిన బీఆర్‌ఎస్ నేతలు

ఉప్పల్, డిసెంబర్ 31(తెలంగాణ ముచ్చట్లు):

కొత్తగా ఏర్పాటైన ఉప్పల్ జోనల్ కమిషనర్ కార్యాలయంలో నూతనంగా నియమితులైన ఉప్పల్ జోనల్ కమిషనర్ రాధిక గుప్తాను బీఆర్‌ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు సాయిజెన్ శేఖర్‌తో పాటు పూర్వ నాచారం డివిజన్ బీఆర్‌ఎస్ నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ సందర్భంగా కొత్తగా ఏర్పాటు చేసిన సర్కిల్‌లో నాచారం డివిజన్‌ను సర్కిల్‌గా ప్రకటించినందుకు సంతోషం వ్యక్తం చేశారు. అలాగే నాచారం ఓల్డ్ విలేజ్‌లో కోటి యాభై లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన నాచారం వార్డు కార్యాలయ భవనాన్ని సర్కిల్ కార్యాలయంగా వినియోగించాల్సిందిగా కమిషనర్‌ను కోరారు.అదేవిధంగా హెచ్‌ఎంటీ నగర్ పెద్ద చెరువులో గుర్రపు డెక్క విపరీతంగా పెరిగిపోవడం వల్ల ప్రజలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలిపారు. ఈ పనుల విషయంలో కాంట్రాక్టర్ల ద్వారా ఇంజనీరింగ్ అధికారులు క్షేత్రస్థాయిలో పనులు చేయించకుండా కేవలం బిల్లులు చెల్లిస్తున్నారంటూ ఫిర్యాదు చేశారు. దీనిపై తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.ఈ కార్యక్రమంలో కట్ట బుచ్చన్న గౌడ్, చంద్రశేఖర్, ఈశ్వర్ తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

భారతదేశం అభివృద్ధి చెందిన దేశంగా మారాలంటే సైన్స్ కీలకం భారతదేశం అభివృద్ధి చెందిన దేశంగా మారాలంటే సైన్స్ కీలకం
వనపర్తి,జనవరి4(తెలంగాణ ముచ్చట్లు): భారతదేశం అభివృద్ధి చెందిన దేశంగా ఎదగాలంటే సైన్స్ ఒక్కటే ప్రధాన ఆధారమని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు డాక్టర్ జిల్లెల చిన్నారెడ్డి అన్నారు. వనపర్తి...
వెనిజులాపై అమెరికా సామ్రాజ్యవాద దాడులను ఖండిస్తూ సీపీఎం ర్యాలీ
జమ్మిగడ్డలో బిఆర్‌ఎస్ నాయకురాలు శేరి మణెమ్మ సేవా కార్యక్రమం
మున్నూరు కాపులు ఐక్యతతో కలిసికట్టుగా ముందుకుసాగాలి  పుట్ట పురుషోత్తం రావు
పెద్ద చెరువుకట్టపై శుభ్రత పనులను పరిశీలిం చిన కార్పొరేటర్ శాంతి సాయిజెన్ శేఖర్
అభివృద్ధే శ్వాసగా పనిచేయండి
పదేళ్లలో పేదోడికి గూడు ఇవ్వని దౌర్భాగ్య ప్రభుత్వం