మేడ్చల్–మల్కాజ్గిరి జిల్లా కోర్టు ఆవరణలో మూడు కొత్త కోర్టులు ప్రారంభం

మేడ్చల్–మల్కాజ్గిరి జిల్లా కోర్టు ఆవరణలో మూడు కొత్త కోర్టులు ప్రారంభం

కుషాయిగూడ, డిసెంబర్ 29 (తెలంగాణ ముచ్చట్లు)

మేడ్చల్–మల్కాజ్గిరి జిల్లా కోర్టు ఆవరణలో న్యాయసేవలను మరింత విస్తరించేందుకు మరో మూడు కోర్టులు నూతనంగా అందుబాటు లోకి వచ్చాయి. ప్రిన్సిపల్ ఫ్యామిలీ కోర్టు, అడిషనల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ కోర్టు, జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ కోర్టులను హైకోర్టు జడ్జి జస్టిస్ కె.లక్ష్మణ్ ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో మేడ్చల్–మల్కాజ్గిరి జిల్లా కోర్టు సీనియర్ జడ్జి శ్రీదేవి, జిల్లా కలెక్టర్ మనో చౌదరి, మల్కాజ్గిరి బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అమరేందర్ రెడ్డి తదితర న్యాయవాదులు, అధికారులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా జస్టిస్ కె.లక్ష్మణ్ మాట్లాడుతూ, త్వరలోనే మల్కాజ్గిరి కోర్టు అత్యాధునిక సౌకర్యాలతో నిర్మాణంలో ఉన్న నూతన భవనంలోకి మారుతుందని తెలిపారు. కోర్టుల సంఖ్య పెరగడం వల్ల కేసుల పరిష్కారం వేగవంతమవుతుందని, ప్రజలకు న్యాయం త్వరగా అందుబాటులోకి వస్తుందని ఆయన పేర్కొన్నారు.అనంతరం బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అమరేందర్ రెడ్డి న్యాయవాదులు ఎదుర్కొంటున్న మౌలిక సదుపాయాల సమస్యలను హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. దీనికి స్పందించిన జస్టిస్ లక్ష్మణ్, అడ్వకేట్ల సమస్యల పరిష్కారానికి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.మేడ్చల్–మల్కాజ్గిరి జిల్లాలో న్యాయవ్యవస్థను మరింత బలోపేతం చేసే దిశగా ఈ మూడు కొత్త కోర్టుల ప్రారంభం కీలక ముందడుగుగా అధికారులు అభిప్రాయపడ్డారు.IMG-20251229-WA0113IMG-20251229-WA0114

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .