అరైవ్ అలైవ్ కార్యక్రమంలో ఆటో డ్రైవర్లకు అవగాహన.

అరైవ్ అలైవ్ కార్యక్రమంలో ఆటో డ్రైవర్లకు అవగాహన.

- సత్తుపల్లి బస్టాండ్‌లో రవాణా నియమాలపై ప్రత్యేక కార్యక్రమం.
- ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటిస్తామని ఆటో యూనియన్ ప్రతిజ్ఞ.

సత్తుపల్లి, జనవరి 21 (తెలంగాణ ముచ్చట్లు):

సత్తుపల్లి టౌన్ పోలీసుల ఆధ్వర్యంలో రోడ్డు ప్రమాదాల నివారణ లక్ష్యంగా చేపట్టిన అరైవ్ అలైవ్ కార్యక్రమం భాగంగా సత్తుపల్లి టౌన్ సీఐ తుమ్మలపల్లి శ్రీహరి బుధవారం సత్తుపల్లి బస్టాండ్‌లో ఆటో యూనియన్ సభ్యులకు రవాణా నిబంధనలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ, రోడ్డు భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని, ముఖ్యంగా ఆటో డ్రైవర్లు ట్రాఫిక్ నియమాలను కచ్చితంగా పాటిస్తే ప్రమాదాలను గణనీయంగా తగ్గించవచ్చని తెలిపారు. అధిక వేగం, తప్పు దారుల్లో వాహనాలు నడపడం వంటి వాటికి దూరంగా ఉండాలని సూచించారు.
అనంతరం ఇకపై అన్ని రవాణా నిబంధనలను తప్పనిసరిగా పాటిస్తామని ఆటో యూనియన్ సభ్యుల చేత ప్రతిజ్ఞ చేయించారు. రోడ్డు భద్రతపై ఇలాంటి కార్యక్రమాలు నిరంతరం కొనసాగుతాయని పోలీసులు తెలిపారు.IMG-20260121-WA0041

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .