అరైవ్ అలైవ్ కార్యక్రమంలో ఆటో డ్రైవర్లకు అవగాహన.

అరైవ్ అలైవ్ కార్యక్రమంలో ఆటో డ్రైవర్లకు అవగాహన.

- సత్తుపల్లి బస్టాండ్‌లో రవాణా నియమాలపై ప్రత్యేక కార్యక్రమం.
- ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటిస్తామని ఆటో యూనియన్ ప్రతిజ్ఞ.

సత్తుపల్లి, జనవరి 21 (తెలంగాణ ముచ్చట్లు):

సత్తుపల్లి టౌన్ పోలీసుల ఆధ్వర్యంలో రోడ్డు ప్రమాదాల నివారణ లక్ష్యంగా చేపట్టిన అరైవ్ అలైవ్ కార్యక్రమం భాగంగా సత్తుపల్లి టౌన్ సీఐ తుమ్మలపల్లి శ్రీహరి బుధవారం సత్తుపల్లి బస్టాండ్‌లో ఆటో యూనియన్ సభ్యులకు రవాణా నిబంధనలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ, రోడ్డు భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని, ముఖ్యంగా ఆటో డ్రైవర్లు ట్రాఫిక్ నియమాలను కచ్చితంగా పాటిస్తే ప్రమాదాలను గణనీయంగా తగ్గించవచ్చని తెలిపారు. అధిక వేగం, తప్పు దారుల్లో వాహనాలు నడపడం వంటి వాటికి దూరంగా ఉండాలని సూచించారు.
అనంతరం ఇకపై అన్ని రవాణా నిబంధనలను తప్పనిసరిగా పాటిస్తామని ఆటో యూనియన్ సభ్యుల చేత ప్రతిజ్ఞ చేయించారు. రోడ్డు భద్రతపై ఇలాంటి కార్యక్రమాలు నిరంతరం కొనసాగుతాయని పోలీసులు తెలిపారు.IMG-20260121-WA0041

Tags:

Post Your Comments

Comments

Latest News

బస్టాండ్ ఆవరణలో పెట్రోల్ బంక్ నిర్మాణానికి బ్రేక్. బస్టాండ్ ఆవరణలో పెట్రోల్ బంక్ నిర్మాణానికి బ్రేక్.
అశ్వారావుపేట, జనవరి 23 (తెలంగాణ ముచ్చట్లు): దమ్మపేట బస్టాండ్ ఆవరణలో పెట్రోల్ బంక్ నిర్మాణాన్ని చేపట్టాలన్న ప్రతిపాదనకు వ్యతిరేకంగా ప్రజా ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని హైకోర్టును ఆశ్రయించి...
కల్లూరు మున్సిపాలిటీలో ఎమ్మెల్యే రాగమయి సుడిగాలి పర్యటన.!
గిడుగు రామ్మూర్తి పంతులు 86వ వర్ధంతి చిత్రపటానికి పూలమాల
అమ్ముగూడ శ్మశానవాటిక అభివృద్ధి పనుల ప్రారంభోత్సవం
భూగర్భ డ్రైనేజీ,అన్నపూర్ణ కాలనీలో స్మశాన వాటిక అభివృద్ధి పనులు ప్రారంభం
మానవత్వమే “ఫాదర్ జెరోమ్" మార్గం
బైరీ నవీన్ గౌడ్ జన్మదిన వేడుకలు లో పాల్గొన్న ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి