అమ్ముగూడ శ్మశానవాటిక అభివృద్ధి పనుల ప్రారంభోత్సవం

అమ్ముగూడ శ్మశానవాటిక అభివృద్ధి పనుల ప్రారంభోత్సవం

యాప్రాల్, జనవరి 22 (తెలంగాణ ముచ్చట్లు):

మల్కాజిగిరి నియోజకవర్గం నేరేడ్మెట్ సర్కిల్ యాప్రాల్ పరిధిలోని అమ్ముగూడ శ్మశానవాటికలో సుమారు రూ.1.90 కోట్ల వ్యయంతో చేపట్టనున్న అభివృద్ధి పనుల ప్రారంభోత్సవం శుక్రవారం ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమం మల్కాజ్‌గిరి ఎంపీ ఈటల రాజేందర్ మరియు నేరేడ్‌మెట్ కార్పొరేటర్ కొత్తపల్లి మీనా ఉపేందర్ రెడ్డి వారి సహకారం, మార్గదర్శకత్వంతో విజయవంతంగా జరిగింది.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, శ్మశానవాటిక అభివృద్ధి ద్వారా సమాజానికి మెరుగైన మౌలిక వసతులు, గౌరవప్రదమైన సౌకర్యాలు అందుబాటులోకి వస్తాయని తెలిపారు. ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని శ్మశానవాటికను సర్వసౌకర్యాలతో అభివృద్ధి చేయడం లక్ష్యమని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు కొత్తపల్లి ఉపేందర్ రెడ్డి, డివిజన్ అధ్యక్షుడు ఆదిత్య, శ్మశానవాటిక అధ్యక్షుడు పరమేష్, పరస్ జైన్, పర్వతాలు, విష్ణు, రమణ్, శ్మశానవాటిక కమిటీ సభ్యులు, స్థానిక నాయకులు మరియు జీహెచ్ఎంసీ అధికారులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .