బైరి నవీన్ గౌడ్ జన్మదినం సందర్భంగా రక్తదాన శిబిరం

150 మందికి పైగా రక్తదానం చేసిన యువత

బైరి నవీన్ గౌడ్ జన్మదినం సందర్భంగా రక్తదాన శిబిరం

కాప్రా, జనవరి 20 (తెలంగాణ ముచ్చట్లు)

బైరి నవీన్ గౌడ్ జన్మదినాన్ని పురస్కరించుకుని కాప్రా డివిజన్ పరిధిలోని ఎల్లరెడ్డిగూడలో మంగళవారం టీమ్ బీఎల్‌ఆర్ & బీఎన్‌జీ యువసేన ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఘనంగా నిర్వహించారు. ఈ శిబిరాన్ని ముడిగొండ కాశీనాథ్ సమన్వయంతో ఏర్పాటు చేయగా, యువతతో పాటు స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.ఈ శిబిరంలో 150 మందికి పైగా స్వచ్ఛందంగా రక్తదానం చేసి మానవతా భావాన్ని చాటుకున్నారు. అత్యవసర పరిస్థితుల్లో రక్తం అవసరమైన రోగులకు ఈ రక్తదానం ఎంతో ఉపయోగపడుతుందని నిర్వాహకులు తెలిపారు. రక్తదానం ద్వారా ఒకరి ప్రాణాన్ని కాపాడే అవకాశం ఉంటుందని పేర్కొంటూ, ఇలాంటి సేవా కార్యక్రమాల్లో యువత చురుకుగా పాల్గొనాలని వారు పిలుపునిచ్చారు.రక్తదాన శిబిరాన్ని విజయవంతంగా నిర్వహించడంలో టీమ్ బీఎల్‌ఆర్ & బీఎన్‌జీ యువసేన సభ్యులు కీలక పాత్ర పోషించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్లు అబ్దుల్ గాఫుర్, స్నేహ, వెంకట్, రేణుక తదితరులు పాల్గొని వైద్య సేవలు అందించారు.ఈ సందర్భంగా నిర్వాహకులు రక్తదాతలను అభినందిస్తూ, భవిష్యత్తులో కూడా ఇలాంటి సేవా కార్యక్రమాలునిరంతరం కొనసాగిస్తామని తెలిపారు. IMG-20260120-WA0025

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .