బైరి నవీన్ గౌడ్ జన్మదినం సందర్భంగా రక్తదాన శిబిరం

150 మందికి పైగా రక్తదానం చేసిన యువత

బైరి నవీన్ గౌడ్ జన్మదినం సందర్భంగా రక్తదాన శిబిరం

కాప్రా, జనవరి 20 (తెలంగాణ ముచ్చట్లు)

బైరి నవీన్ గౌడ్ జన్మదినాన్ని పురస్కరించుకుని కాప్రా డివిజన్ పరిధిలోని ఎల్లరెడ్డిగూడలో మంగళవారం టీమ్ బీఎల్‌ఆర్ & బీఎన్‌జీ యువసేన ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఘనంగా నిర్వహించారు. ఈ శిబిరాన్ని ముడిగొండ కాశీనాథ్ సమన్వయంతో ఏర్పాటు చేయగా, యువతతో పాటు స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.ఈ శిబిరంలో 150 మందికి పైగా స్వచ్ఛందంగా రక్తదానం చేసి మానవతా భావాన్ని చాటుకున్నారు. అత్యవసర పరిస్థితుల్లో రక్తం అవసరమైన రోగులకు ఈ రక్తదానం ఎంతో ఉపయోగపడుతుందని నిర్వాహకులు తెలిపారు. రక్తదానం ద్వారా ఒకరి ప్రాణాన్ని కాపాడే అవకాశం ఉంటుందని పేర్కొంటూ, ఇలాంటి సేవా కార్యక్రమాల్లో యువత చురుకుగా పాల్గొనాలని వారు పిలుపునిచ్చారు.రక్తదాన శిబిరాన్ని విజయవంతంగా నిర్వహించడంలో టీమ్ బీఎల్‌ఆర్ & బీఎన్‌జీ యువసేన సభ్యులు కీలక పాత్ర పోషించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్లు అబ్దుల్ గాఫుర్, స్నేహ, వెంకట్, రేణుక తదితరులు పాల్గొని వైద్య సేవలు అందించారు.ఈ సందర్భంగా నిర్వాహకులు రక్తదాతలను అభినందిస్తూ, భవిష్యత్తులో కూడా ఇలాంటి సేవా కార్యక్రమాలునిరంతరం కొనసాగిస్తామని తెలిపారు. IMG-20260120-WA0025

Tags:

Post Your Comments

Comments

Latest News

బస్టాండ్ ఆవరణలో పెట్రోల్ బంక్ నిర్మాణానికి బ్రేక్. బస్టాండ్ ఆవరణలో పెట్రోల్ బంక్ నిర్మాణానికి బ్రేక్.
అశ్వారావుపేట, జనవరి 23 (తెలంగాణ ముచ్చట్లు): దమ్మపేట బస్టాండ్ ఆవరణలో పెట్రోల్ బంక్ నిర్మాణాన్ని చేపట్టాలన్న ప్రతిపాదనకు వ్యతిరేకంగా ప్రజా ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని హైకోర్టును ఆశ్రయించి...
కల్లూరు మున్సిపాలిటీలో ఎమ్మెల్యే రాగమయి సుడిగాలి పర్యటన.!
గిడుగు రామ్మూర్తి పంతులు 86వ వర్ధంతి చిత్రపటానికి పూలమాల
అమ్ముగూడ శ్మశానవాటిక అభివృద్ధి పనుల ప్రారంభోత్సవం
భూగర్భ డ్రైనేజీ,అన్నపూర్ణ కాలనీలో స్మశాన వాటిక అభివృద్ధి పనులు ప్రారంభం
మానవత్వమే “ఫాదర్ జెరోమ్" మార్గం
బైరీ నవీన్ గౌడ్ జన్మదిన వేడుకలు లో పాల్గొన్న ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి