భూగర్భ డ్రైనేజీ,అన్నపూర్ణ కాలనీలో స్మశాన వాటిక అభివృద్ధి పనులు ప్రారంభం

భూగర్భ డ్రైనేజీ,అన్నపూర్ణ కాలనీలో స్మశాన వాటిక అభివృద్ధి పనులు ప్రారంభం

నాచారం, జనవరి 22 (తెలంగాణ ముచ్చట్లు):

ఉప్పల్ నియోజకవర్గం నాచారం ప్రాంతంలో రూ.11.55 లక్షల వ్యయంతో చేపట్టిన భూగర్భ డ్రైనేజీ నిర్మాణ పనులను ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి , స్థానిక కార్పొరేటర్ శాంతి సాయిజెన్ శేఖర్ తో కలిసి ప్రారంభించారు. ఈ డ్రైనేజీ పనుల ద్వారా స్థానిక ప్రజలు ఎదుర్కొంటున్న పారిశుధ్య సమస్యలకు శాశ్వత పరిష్కారం లభించనుందని తెలిపారు.అనంతరం అన్నపూర్ణ కాలనీలోని బుడగ జంగాల స్మశాన వాటికలో రూ.50 లక్షల వ్యయంతో చేపట్టిన పలు అభివృద్ధి పనులను ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి  శుభారంభం చేశారు. ఈ పనుల ద్వారా స్మశాన వాటికలో మౌలిక వసతులు మరింత మెరుగుపడి, ప్రజలకు సౌకర్యవంతంగా మారనున్నాయని ఆయన పేర్కొన్నారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, ప్రభుత్వ లక్ష్యం ప్రతి కాలనీలో అవసరమైన మౌలిక వసతులను కల్పించడం అని, ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకుని అభివృద్ధి పనులను వేగవంతంగా చేపడుతున్నామని తెలిపారు.ఈ కార్యక్రమంలో వివిధ కాలనీల ప్రతినిధులు, బుడగ జంగాల అసోసియేషన్ సభ్యులు, స్థానిక నాయకులు, పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

బస్టాండ్ ఆవరణలో పెట్రోల్ బంక్ నిర్మాణానికి బ్రేక్. బస్టాండ్ ఆవరణలో పెట్రోల్ బంక్ నిర్మాణానికి బ్రేక్.
అశ్వారావుపేట, జనవరి 23 (తెలంగాణ ముచ్చట్లు): దమ్మపేట బస్టాండ్ ఆవరణలో పెట్రోల్ బంక్ నిర్మాణాన్ని చేపట్టాలన్న ప్రతిపాదనకు వ్యతిరేకంగా ప్రజా ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని హైకోర్టును ఆశ్రయించి...
కల్లూరు మున్సిపాలిటీలో ఎమ్మెల్యే రాగమయి సుడిగాలి పర్యటన.!
గిడుగు రామ్మూర్తి పంతులు 86వ వర్ధంతి చిత్రపటానికి పూలమాల
అమ్ముగూడ శ్మశానవాటిక అభివృద్ధి పనుల ప్రారంభోత్సవం
భూగర్భ డ్రైనేజీ,అన్నపూర్ణ కాలనీలో స్మశాన వాటిక అభివృద్ధి పనులు ప్రారంభం
మానవత్వమే “ఫాదర్ జెరోమ్" మార్గం
బైరీ నవీన్ గౌడ్ జన్మదిన వేడుకలు లో పాల్గొన్న ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి