కూకట్పల్లి జోనల్ కార్యాలయంలో ఏసీబీ మెరుపు దాడులు
మేడ్చల్ మల్కాజిగిరి, ఫిబ్రవరి 04 (తెలంగాణ ముచ్చట్లు):
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలోని కూకట్పల్లి జీహెచ్ఎంసీ జోనల్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు మెరుపు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో సూపరింటెండింగ్ ఇంజనీర్ (ఎస్ఈ) చిన్నారెడ్డి ఓ కాంట్రాక్టర్ నుంచి రూ.15 లక్షల లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డారు.పెండింగ్లో ఉన్న బిల్లుల క్లియరెన్స్ కోసం లంచం డిమాండ్ చేసినట్లు ఏసీబీ వర్గాలు వెల్లడించాయి. బాధిత కాంట్రాక్టర్ నుంచి ఫిర్యాదు అందడంతో ముందస్తు ప్రణాళికతో వలపన్నిన అధికారులు, లంచం స్వీకరిస్తున్న సమయంలోనే ఎస్ఈని అదుపులోకి తీసుకున్నారు.ప్రభుత్వ కార్యాలయాల్లో అవినీతిని ఏ మాత్రం సహించబోమని ఏసీబీ అధికారులు స్పష్టం చేశారు. ఇలాంటి అక్రమాలకు పాల్పడే అధికారులపై కఠిన చర్యలు కొనసాగుతాయని హెచ్చరించారు. ఈ ఘటనతో జీహెచ్ఎంసీ వర్గాల్లో తీవ్ర కలకలం రేగింది.


Comments