అభివృద్ధి మాట కాదు… బాధ్యత.!

20వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి కమల్ పాషా హామీ.

అభివృద్ధి మాట కాదు… బాధ్యత.!

సత్తుపల్లి, ఫిబ్రవరి 4 (తెలంగాణ ముచ్చట్లు):

సత్తుపల్లి మున్సిపాలిటీ పరిధిలోని 20వ వార్డు ప్రజలకు కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి కమల్ పాషా అభివృద్ధిపై గట్టి హామీ ఇచ్చారు. “నేను మీలో ఒకడిని… మీ ఇంటి బిడ్డను” అంటూ ఇంటింటి ప్రచారంలో పాల్గొంటూ ప్రజల ఆశీర్వాదం కోరుతున్నారు.
ఈ సందర్భంగా కమల్ పాషా మాట్లాడుతూ, వార్డు ప్రజలకు 24 గంటలూ అందుబాటులో ఉంటూ స్థానిక సమస్యల పరిష్కారమే ధ్యేయంగా పనిచేస్తానని తెలిపారు. సీసీ రోడ్ల నిర్మాణం, మెరుగైన సైడ్ డ్రైనేజీ వ్యవస్థ, ప్రతి ఇంటికి స్వచ్ఛమైన తాగునీటి సరఫరా వంటి మౌలిక వసతుల అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తామని పేర్కొన్నారు. అర్హులైన ప్రతి పేదవారికి రేషన్ కార్డులు, ఇళ్లు, ఇళ్ల స్థలాల మంజూరుకు నిరంతరం కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఇప్పటికే వార్డులో నెలకొన్న విద్యుత్ సమస్యను గుర్తించి, తన సొంత ఖర్చులతో కరెంటు పోల్స్ ఏర్పాటు చేయించినట్లు తెలిపారు. ఇది తన సేవాభావానికి నిదర్శనమని పేర్కొన్నారు. 20వ వార్డును ఆదర్శవంతంగా తీర్చిదిద్దే అవకాశం ఇవ్వండి అంటూ ఈ నెల 11న జరగనున్న మున్సిపల్ ఎన్నికల్లో హస్తం గుర్తుపై ఓటు వేసి తనను భారీ మెజార్టీతో గెలిపించాలని కమల్ పాషా ఓటర్లను కోరారు.
ఈ ప్రచార కార్యక్రమంలో సీనియర్ నాయకులు అలవాల కరుణాకర్, రాయల కోటేశ్వరావు, గజ్జల శీను సంపత్, జూపాటి పాపారావు, ప్రణతి వెంకటేశ్వరావు, కొత్తపల్లి శివతో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.IMG-20260204-WA0044

Tags:

Post Your Comments

Comments

Latest News

కాంగ్రెస్ ప్రభుత్వంతోనే అభివృద్ధి సాధ్యం కాంగ్రెస్ ప్రభుత్వంతోనే అభివృద్ధి సాధ్యం
వనపర్తి,ఫిబ్రవరి4(తెలంగాణ ముచ్చట్లు): రానున్న మరో ఎనిమిది సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీనే అధికారంలో ఉంటుందని, నిరుపేదలందరికీ సంక్షేమ ఫలాలు అందిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని వనపర్తి...
ఎస్సీ విద్యార్థుల ప్రీ మెట్రిక్ స్కాలర్‌ షిప్ నమోదు వేగవంతం చేయాలి
నితిన్ నబిన్ బహిరంగ సభకు బయలుదేరిన పెద్దమందడి బీజేపీ నాయకులు
వ్యవసాయ రంగాన్ని సంక్షోభం నుంచి బయటపడేయాలి
మనిగిల్ల ప్రభుత్వ పాఠశాలలో వార్షికోత్సవాలపై చర్చ
ఎల్లంపేట్‌లో అక్రమ మద్యం స్వాధీనం
6వ వార్డులో బీజేపీ ప్రచార హోరు.