అంతర్జాతీయ కరాటే పోటీల్లో సత్తా చాటిన విద్యార్థులు
ద బెస్ట్ టీమ్’ ట్రోఫీని అందుకున్న కరాటే మాస్టర్ రవికుమార్ గౌడ్
కుషాయిగూడ, ఫిబ్రవరి 05 (తెలంగాణ ముచ్చట్లు):
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విశాఖపట్నంలో శుక్రవారం నిర్వహించిన అంతర్జాతీయ కరాటే పోటీల్లో కుషాయిగూడ, చర్లపల్లి ప్రాంతాలకు చెందిన ఛాంపియన్ షాటోఖాన్ మార్షల్ ఆర్ట్స్ అకాడమీ విద్యార్థులు అద్భుత ప్రతిభ కనబరిచి పతకాల వర్షం కురిపించారు.ఈ పోటీల్లో అకాడమీ విద్యార్థులు కట విభాగంలో నాలుగు బంగారు పతకాలు, రెండు వెండి పతకాలు, మూడు కాంస్య పతకాలు సాధించగా, కుమిటే విభాగంలో ఐదు వెండి పతకాలు, నాలుగు కాంస్య పతకాలు గెలుచుకున్నారు. ఈ విశేష విజయానికి గాను అకాడమీ ఫౌండర్, ప్రెసిడెంట్ కరాటే మాస్టర్ బుడిగే రవికుమార్ గౌడ్కు నిర్వాహకులు “ద బెస్ట్ టీమ్” ట్రోఫీని అందజేశారు.కట విభాగంలో శ్రీశాంత్ గౌడ్, విష్ణు, ప్రభావ్, మనస్విని బంగారు పతకాలు సాధించగా, రుద్ర, శ్రీహిత వెండి పతకాలు దక్కించుకున్నారు. అలాగే మనస్విని, శ్రీనిష్, ఉదయశ్రీ కాంస్య పతకాలు సాధించారు.కుమిటే విభాగంలో శ్రీశాంత్ గౌడ్, విష్ణు, శ్రీహిత, ఉదయశ్రీ, రుద్ర వెండి పతకాలు గెలుచుకోగా, శ్రీనిష్, ప్రభావ్, మనస్విని, మనవిశ్రీ కాంస్య పతకాలు సాధించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విశాఖపట్నం వెస్ట్ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ పి.జి.వి.ఆర్. నాయుడు, కరాటే ఆర్గనైజేషన్ సెక్రటరీ తాజద్దీన్ హాజరయ్యారు. ఈ సందర్భంగా కరాటే మాస్టర్ రవికుమార్ గౌడ్ను శాలువాతో సత్కరించి మెమొంటో అందజేశారు. అలాగే విజేతలైన విద్యార్థులకు పతకాలు, సర్టిఫికెట్లు ప్రదానం చేశారు.


Comments