జీహెచ్ఎంసీ కాంట్రాక్ట్ ఉద్యోగి అదృశ్యం
చర్లపల్లి పోలీస్స్టేషన్లో ఫిర్యాదు నమోదు
Views: 14
On
చర్లపల్లి, ఫిబ్రవరి 06 (తెలంగాణ ముచ్చట్లు):
జీహెచ్ఎంసీలో కాంట్రాక్ట్ ఉద్యోగిగా పనిచేస్తున్న యువకుడు అదృశ్యమైన ఘటన చర్లపల్లి పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. అలకుంట్ల చారి తెలిపిన వివరాల ప్రకారం, అతని సోదరుడు అలకుంట్ల విజయ్ (30) జీహెచ్ఎంసీలో కాంట్రాక్ట్ ఉద్యోగిగా విధులు నిర్వహిస్తున్నాడు.ఇటీవల భార్యతో జరిగిన కుటుంబ కలహం అనంతరం విజయ్ చర్లపల్లిలోని పూకట్నగర్లో తన సోదరుడి ఇంటికి వచ్చి రెండు రోజులపాటు అక్కడే ఉండి వెళ్లాడు. అనంతరం కొద్ది రోజులుగా విజయ్ ఆచూకీ తెలియకపోవడంతో కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.ఈ విషయమై అలకుంట్ల చారి చర్లపల్లి పోలీసులకు ఫిర్యాదు చేయగా, పోలీసులు కేసు నమోదు చేసి విజయ్ ఆచూకీ కోసం దర్యాప్తు ప్రారంభించినట్లు తెలిపారు.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
06 Feb 2026 21:54:49
ఖమ్మం బ్యూరో, ఫిబ్రవరి 6(తెలంగాణ ముచ్చట్లు)
ఖమ్మం రూరల్ మండలం పెద్ద తండాలోని ప్రియదర్శిని ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీలోని ఏర్పాటు చేసిన ఏదులాపురం మునిసిపాలిటీ...


Comments