స్మశాన వాటికను వైకుంఠధారణగా తీర్చిదిద్దుతున్నాం

కార్పొరేటర్ శాంతి సాయిజెన్

స్మశాన వాటికను వైకుంఠధారణగా తీర్చిదిద్దుతున్నాం

నాచారం, ఫిబ్రవరి 06 (తెలంగాణ ముచ్చట్లు):

ఉప్పల్ నియోజకవర్గం నాచారం డివిజన్ పరిధిలోని రెడ్డి సంఘానికి చెందిన రెడ్డి స్మశాన వాటికను వైకుంఠధారణగా అభివృద్ధి చేస్తున్నామని కార్పొరేటర్ శాంతి సాయిజెన్ తెలిపారు.రూ.58 లక్షల రూపాయల వ్యయంతో చేపడుతున్న స్మశాన వాటిక అభివృద్ధి పనులను కార్పొరేటర్ శాంతి సాయిజెన్ రెడ్డి సంఘం నాయకులు, సంబంధిత అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా పనుల పురోగతిని సమీక్షించి, నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ పనులను వేగవంతంగా పూర్తి చేయాలని అధికారులకు సూచించారు.అలాగే, స్మశాన వాటికలో ఇంకా అవసరమైన మౌలిక సదుపాయాలు ఏవైనా ఉంటే వెంటనే అధికారుల దృష్టికి తీసుకురావాలని రెడ్డి సంఘం నాయకులను కోరారు. అవసరమైతే అదనపు నిధుల కోసం ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు.ఈ కార్యక్రమంలో డీఈ ఉమామహేశ్వరి, వర్క్ ఇన్స్పెక్టర్ విజయ్ కుమార్, రెడ్డి సంఘం అధ్యక్షులు ఎర్రం శ్రీనివాస్ రెడ్డి, రమణారెడ్డి, శంకర్ రెడ్డి, మోహన్ రెడ్డి, రాఘవేందర్ రెడ్డి, హరినాథ్ రెడ్డి, వెంకట్ రెడ్డి, మధుసూదన్ రెడ్డి, రాజేందర్ రెడ్డి, నర్సిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

బ్యాలెట్ పేపర్స్ స్ట్రాంగ్ రూమ్‌ అర్ముడ్ గార్డు తనిఖీ చేసిన అడిషనల్ డిసిపి బ్యాలెట్ పేపర్స్ స్ట్రాంగ్ రూమ్‌ అర్ముడ్ గార్డు తనిఖీ చేసిన అడిషనల్ డిసిపి
ఖమ్మం బ్యూరో, ఫిబ్రవరి 6(తెలంగాణ ముచ్చట్లు) ఖమ్మం రూరల్ మండలం పెద్ద తండాలోని ప్రియదర్శిని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీలోని ఏర్పాటు చేసిన ఏదులాపురం మునిసిపాలిటీ...
మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో మద్యం దుకాణాలు బంద్ 
మున్సిపల్ ఎన్నికలు: ఫిబ్రవరి 11న స్థానిక సెలవు
నేడు..కొత్తగూడెంలో ఖమ్మం ఎంపీ రఘురాం రెడ్డి విస్తృత ప్రచారం
వడ్డెర సంఘం ఖమ్మం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ గా గోగుల ఆది 
అక్రిడిటేషన్ కార్డుల జారీకి ఆన్‌లైన్ దరఖాస్తులు ఆహ్వానం.. 
సత్తుపల్లి 14వ వార్డులో ప్రజల మనిషిగా కూసంపూడి మహేష్.