రాజకీయాలు కాదు, ప్రజా శ్రేయస్సే నా లక్ష్యం కార్పొరేటర్ శాంతి సాయిజెన్
నాచారం, ఫిబ్రవరి 06 (తెలంగాణ ముచ్చట్లు):
ఉప్పల్ నియోజకవర్గం నాచారం సర్కిల్ నాచారం రైతు బజార్లోని బోర్వెల్ కొద్దీ రోజుల క్రితం పాడిపోయింది. దీని కారణంగా మార్కెట్ వాసులు, కూరగాయల వ్యాపారస్తులు, బస్తీ దవాఖానకు వచ్చే వారు మరియు డాక్టర్లు, సిబ్బంది తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సమస్యను స్థానిక కార్పొరేటర్ శాంతి సాయిజెన్ దృష్టికి తీసుకురావడం జరిగింది.
హైదరాబాద్లో బోర్వెల్ల రిపేర్ లేదా మెయింటెనెన్స్ జిహెచ్ఎంసి ద్వారా చేయడంలేదని కార్పొరేటర్ తెలిపారు. దీంతో, ఆయన స్వయంగా తన ఖర్చుతో బోర్వెల్ రిపేర్ చేయిస్తానని హామీ ఇచ్చి, ఆ పని చేపట్టారు.ఈ సందర్భంగా మార్కెట్ వ్యాపారస్తులు కార్పొరేటర్ను శాలువాతో సత్కరించి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో లక్ష్మణ్ కిట్టు, మూర్తి దయానంద్, కిషోర్, రమేష్, వేణు, తరుణ్, నిర్మల, రాము, రాజు, మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.కార్పొరేటర్ శాంతి సాయిజెన్ మాట్లాడుతూ, “రాజకీయాలు కాదు, ప్రజల శ్రేయస్సే నా ప్రధాన లక్ష్యం” అని పేర్కొన్నారు.


Comments