అక్రిడిటేషన్ కార్డుల జారీకి ఆన్లైన్ దరఖాస్తులు ఆహ్వానం
ఈ నెల 9 నుంచి ఆన్లైన్లో దరఖాస్తుల స్వీకరణ
మేడ్చల్–మల్కాజిగిరి, ఫిబ్రవరి 07 (తెలంగాణ ముచ్చట్లు):
సమాచార పౌరసంబంధాల శాఖ ఆధ్వర్యంలో 2026–28 సంవత్సరాల కాలానికి జర్నలిస్టులకు అక్రిడిటేషన్ కార్డుల జారీ కోసం ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా అక్రిడిటేషన్ కమిటీ చైర్మన్, జిల్లా కలెక్టర్ మను చౌదరి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు.ప్రస్తుతం అమల్లో ఉన్న అక్రిడిటేషన్ కార్డుల గడువు ఈ నెల 28వ తేదీతో ముగియనున్న నేపథ్యంలో అర్హత కలిగిన జర్నలిస్టులకు నూతన అక్రిడిటేషన్ కార్డులు జారీ చేయనున్నట్లు ఆయన తెలిపారు.
జిల్లా స్థాయి అక్రిడిటేషన్ కార్డుల కోసం మీడియా యాజమాన్యాలు తమ జర్నలిస్టుల పేర్ల జాబితాను జిల్లా పౌరసంబంధాల అధికారికి సమర్పించాలని సూచించారు. యాజమాన్యాల ద్వారా పంపిన పేర్లలో ఉన్న జర్నలిస్టులు సమాచార పౌరసంబంధాల శాఖ అధికారిక వెబ్సైట్http://ipr.telangana.gov.in�
ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు.జిల్లా స్థాయిలో ఆన్లైన్ దరఖాస్తుల స్వీకరణ ఈ నెల 9వ తేదీ నుంచి ప్రారంభమవుతుందని పేర్కొంటూ, అర్హులైన జర్నలిస్టులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ మను చౌదరి కోరారు.


Comments