అభివృద్ధి, సంక్షేమం అందించే చేతి గుర్తు పై మీ విలువైన ఓటు వేసి గెలిపించండి...
వైరా మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారంలో 3 వ వార్డు అభ్యర్థి బొర్రా రాజశేఖర్ సతీమణి బొర్రా ఉమాదేవి...
ఖమ్మం బ్యూరో, ఫిబ్రవరి 7 (తెలంగాణ ముచ్చట్లు)
వైరా మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారంలో భాగంగా 3 వ వార్డులో బొర్రా ఉమాదేవి విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి తిరుగుతూ ఓటర్లను కలుస్తు ఓట్లు అభ్యర్థిస్తున్నారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. .ప్రజలకు కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను వివరించారు. మున్సిపాలిటీ ఎన్నికల్లో చేతి గుర్తు పై ఓటు వేసి కాంగ్రెస్ పార్టీ ని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఓటర్లను కోరారు. అధికార పార్టీకి అండగా నిలవడం ద్వారా అభివృద్ధి సాధ్యమవుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో వైరా కాంగ్రెస్ పార్టీ 3 వ డివిజన్ అధ్యక్షుడు పర్స రవి
, ఏదునూరి చిన్న కోటయ్య, పర్స రామకృష్ణ, ఉయ్యూరు సతీష్, చింతల నరసింహారావు, సురబి శ్రీను, ధర్నా ఉపేందర్, సురభి నాగేశ్వరరావు, పర్స రాము కాసుల అయ్యప్ప, పర్స పిచ్చయ్య, చింతల సైదులు, బొర్రా వినోద్, పర్స పుల్లయ్య, కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.


Comments