సీసీ రోడ్లు, డ్రైనేజీ, తాగునీటి సమస్యల పరిష్కారానికి చర్యలు
కాలనీలో విస్తృతంగా పర్యటించిన కార్పొరేటర్ రజిత పరమేశ్వర్ రెడ్డి
ఉప్పల్, ఫిబ్రవరి 07 (తెలంగాణ ముచ్చట్లు):
ఉప్పల్ డివిజన్ పరిధిలోని విజయపురి కాలనీలో అతి త్వరలోనే మౌలిక వసతుల అభివృద్ధి పనులను చేపట్టనున్నట్లు కార్పొరేటర్ మందుముల రజిత పరమేశ్వర్ రెడ్డి తెలిపారు. కాలనీలో నెలకొన్న సీసీ రోడ్లు, డ్రైనేజీ, తాగునీటి సమస్యలను పరిష్కరించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు.శనివారం ఉప్పల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ మందుముల పరమేశ్వర్ రెడ్డితో కలిసి కార్పొరేటర్ రజిత పరమేశ్వర్ రెడ్డి విజయపురి కాలనీలో విస్తృతంగా పర్యటించారు. ఈ సందర్భంగా కాలనీవాసులు డ్రైనేజీ సదుపాయాల లోపం, సీసీ రోడ్ల అవసరం, తాగునీటి సమస్యలను ఆయన దృష్టికి తీసుకువచ్చారు.కాలనీవాసుల సమస్యలపై స్పందించిన కార్పొరేటర్, అతి త్వరలోనే అభివృద్ధి పనులను ప్రారంభించి సకాలంలో పూర్తి చేసేలా సంబంధిత అధికారులను ఆదేశిస్తామని భరోసా ఇచ్చారు. కాలనీ అభివృద్ధికి నిధుల కొరత లేకుండా అన్ని విధాలా కృషి చేస్తామని తెలిపారు.ఈ కార్యక్రమంలో డీఈ వెనీల్ గౌడ్, ఏఈ రాజ్ కుమార్, విజయపురి కాలనీ అధ్యక్షులు లింగారెడ్డి, దేవి రెడ్డి, సుంకు శేఖర్ రెడ్డి, జనరల్ సెక్రటరీ శ్రీపతి నరేందర్ రెడ్డి, సల్ల ప్రభాకర్ రెడ్డి, తుమ్మల రాజేందర్ రెడ్డి, జంగా రెడ్డి, వెంకటేష్, ఎం. శ్రీనివాస్ రెడ్డి, ఎస్. మాధవరెడ్డి, కే. మల్లారెడ్డి, రాణి, యమునా, అమృత, సుబ్బమ్మ, మస్తాన్ రెడ్డి, వెంకట్ రెడ్డి, బిక్షం రెడ్డి, సుదర్శన్, జి. వెంకట్ రెడ్డి, మహేందర్ రెడ్డి, ప్రభాకర్ రెడ్డి, బిక్షపతి, పి. శ్రీనివాస్ రెడ్డి, కే. శ్రీనివాస్, అల్లా బాషా, నాగూర్ భాష, జాంగిర్, సోమిరెడ్డి, ఎన్. రాజేందర్, బొమ్మజి రత్నం, లెక్కల అంజిరెడ్డి, బెన్నీ భీమ్ సేన్, బడుగుల ఉపేందర్ యాదవ్, సుబ్బారెడ్డి, నాగు నాయక్, మోహన్ నాయక్, అన్వర్ పాషా, కంచం మీద శ్రీనివాస్, సురేష్ యాదవ్, మౌలానా, చింతకింద శ్రీనివాస్, మల్లికార్జున్ తదితరులు పాల్గొన్నారు.


Comments