రమాబాయి అంబేద్కర్ జీవితం మహిళలకు ఆదర్శం
సాహితి కళావేదిక జిల్లా అధ్యక్షులు పలుస శంకర్ గౌడ్
వనపర్తి,ఫిబ్రవరి7(తెలంగాణ ముచ్చట్లు):
రమాబాయి అంబేద్కర్ జీవితం మహిళలందరికీ ఆదర్శంగా నిలవాలని సాహితీ కళా వేదిక వనపర్తి జిల్లా అధ్యక్షులు పలుస శంకర్గౌడ్ అన్నారు. రమాబాయి అంబేద్కర్ జయంతిని జై భీమ్ స్వచ్ఛంద సంఘం అధ్యక్షులు బండారు శ్రీనివాస్ అధ్యక్షతన ప్రభుత్వ ఆసుపత్రిలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన పలుస శంకర్గౌడ్ మాట్లాడుతూ.. రమాబాయి అంబేద్కర్ చిన్న సహకారంతోనే విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించి గొప్ప స్థాయికి చేరుకున్నారని తెలిపారు.మహిళలు రమాబాయి అంబేద్కర్లా కుటుంబ సభ్యులకు సహకారం అందిస్తే, కుటుంబాలు ఉన్నత స్థానాలకు చేరుకుంటాయని ఆయన అన్నారు. చావు నీది, పుట్టుక నీది, బ్రతుకంతా సమాజానిది అనే ఆదర్శ వాక్యాన్ని జీవితాంతం ఆచరించిన రమాబాయి అంబేద్కర్ జీవితం ప్రతి ఒక్కరూ అనుసరించాల్సినదిగా ఉందని శంకర్గౌడ్ పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో జై భీమ్ సొసైటీ అధ్యక్షులు బండారు శ్రీనివాస్, కవి జనజ్వాల, గంధం నాగరాజు, శ్రీనివాస్ రెడ్డి, స్వామి, గంధం గోవింద్, కల్పన తదితరులు పాల్గొన్నారు.


Comments