నినాదాల దేశం నిశ్శబ్ద శ్మశానం....
ఈ దేశంలో ఒకరికి కోట్లు వర్షం,
మరొకరికి ఆకలే నిత్య శిక్షం,
అయినా నినాదం ఒకే మాట,
అభివృద్ధి అంటూ మోగే పాట.
బంగారు పళ్ళెంలో భోజన రుచి,
చెత్తబుట్టలో వెతుక్కునే ఆకలి కుచి,
ఈ రెండింటి మధ్యే నడిచే రాజ్యం,
దీనికే పేరు పెట్టారు పురోగతి ధైర్యం.
పుస్తకాలలో మాత్రమే సమానత్వం,
వీధుల్లో మాత్రం అసమానత్వం,
నినాదాల్లోనే ప్రజాస్వామ్యం,
జీవితాల్లో మాత్రం కార్పొరేట్ సామ్రాజ్యం.
ఒకవైపు భవనాల ఆకాశ ప్రయాణం,
మరోవైపు పేద హృదయాల శ్మశానం,
రోడ్లు వెడల్పయ్యాయి, కలలు ఇరుకయ్యాయి,
మనుషులు సంఖ్యలుగా మారిపోయాయి.
వోటు వేళ పలకరిస్తారు స్నేహంగా,
ఆకలి అడిగితే పంపిస్తారు మౌనంగా,
ప్రసంగాల్లో వాగ్దానాల వరద ప్రవాహం,
పేద గుండెల్లో మాత్రం ఎండిన విశ్వాసం.
మందిరాలు ఎత్తుకు ఎదుగుతాయి,
మనిషి మాత్రం మట్టికి దిగజారుతాడు,
భగవంతుడి పేరు బంగారమవుతుంది,
భక్తుడి ఆకలి శిల్పమవుతుంది.
ఒకవైపు షేర్ మార్కెట్ సంబరం,
మరోవైపు శ్రమజీవి శోక సమరం,
లాభాల పట్టికలో దేశం సుభిక్షం,
ఆకలి పట్టికలో మనిషి విధ్వంసం.
ఇది అభివృద్ధి కాదు ఓటు వ్యాపారం,
ప్రజల కన్నీళ్లపై నడిచే పాలక సంస్కారం,
సంపద రాజ్యమై సింహాసనం ఎక్కితే,
మనుషులు సమాధులుగా లెక్కించబడితే.
✍️బసడ సంపత్ యాదవ్


Comments