సిసి రోడ్డు పనులు ప్రారంభించిన ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి

కాలనీ సమస్యల పరిష్కారానికి హామీ

సిసి రోడ్డు పనులు ప్రారంభించిన ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి

నాచారం, ఫిబ్రవరి 08 (తెలంగాణ ముచ్చట్లు):

ఉప్పల్ నియోజకవర్గం నాచారం సర్కిల్ మీర్పేట్ హెచ్‌బీ కాలనీ డివిజన్ పరిధిలోని ఇందిరానగర్ కాలనీ ఫేజ్–2లో సిసి రోడ్డు నిర్మాణ పనుల ప్రారంభోత్సవ కార్యక్రమం  ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి పాల్గొని రోడ్డు పనులను ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ ప్రభుదాస్, డివిజన్ అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి, వంజరి ప్రవీణ్, కాలనీ అధ్యక్షుడు సతీష్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి హరి ప్రసాద్, కోశాధికారి జనార్దన్, రంగారెడ్డి, అలీముద్దీన్, శ్రీనివాస్ రెడ్డి, ప్రకాష్‌తో పాటు కాలనీ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా కాలనీలో నెలకొన్న తాగునీరు, డ్రైనేజీ, రహదారులు, వీధిదీపాల వంటి పలు సమస్యలను కాలనీవాసులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. స్పందించిన ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి కాలనీలోని అన్ని సమస్యలను దశలవారీగా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు కల్పించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఎమ్మెల్యే పేర్కొన్నారు. సిసి రోడ్డు నిర్మాణంతో కాలనీవాసులకు శాశ్వత ప్రయోజనం చేకూరుతుందని ఆయన తెలిపారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

అగ్ని ప్రమాద బాధిత కుటుంబానికి ఎమ్మెల్యే జారె భరోసా. అగ్ని ప్రమాద బాధిత కుటుంబానికి ఎమ్మెల్యే జారె భరోసా.
అశ్వారావుపేట, ఫిబ్రవరి 8 (తెలంగాణ ముచ్చట్లు): అశ్వారావుపేట మండలం నారంవారిగూడెం కాలనీలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా సంభవించిన అగ్ని ప్రమాదంలో యలమర్తి రమాదేవి భర్త కోటేశ్వరరావుకు...
నేడు విద్యుత్ పలు ప్రాంతాల్లో సరఫరా నిలిపివేత
సిసి రోడ్డు పనులు ప్రారంభించిన ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి
అంబేద్కర్ ఇచ్చిన ఓటు దేశప్రజల వజ్రాయుధం
18వ వార్డు అభివృద్ధికి అవకాశం ఇవ్వండి అభివృద్ధి చేసి చూపిస్తా
వ్యూహకర్త.. విశ్వసనీయతకు నిలువెత్తు సాక్ష్యం!
జర్నలిస్టుల సంక్షేమానికి కృషి చేస్తా : ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి