విద్యార్థుల ఎన్రోల్మెంట్ పెంపుపై మరింత శ్రద్ధ అవసరం

విద్యార్థుల ఎన్రోల్మెంట్ పెంపుపై మరింత శ్రద్ధ అవసరం

హన్మకొండ,ఫిబ్రవరి09(తెలంగాణ ముచ్చట్లు):

జిల్లా పర్యవేక్షణలో భాగంగా సోమవారం పీఎస్ డీఐటీ టీమ్–2 ఐనవోలు మండలం నర్సిములాగూడెం ప్రాధమిక పాఠశాలను సందర్శించింది. ఈ పర్యవేక్షణ బృందంలో నోడల్ ఆఫీసర్ ఎల్. నరేంద్రనాయక్, సభ్యుడు బి. శివప్రసాద్ పాల్గొన్నారు.ఈ సందర్భంగా బృందం పాఠశాల ప్రధానోపాధ్యాయుడు బి. రవీందర్, ఉపాధ్యాయుడు **వంశీధర్**లతో సమావేశమై పాఠశాలలో కొనసాగుతున్న విద్యా, విద్యేతర అంశాలపై సమగ్ర సమీక్ష నిర్వహించింది. అడ్మిషన్ రిజిస్టర్‌లో సర్టిఫికెట్ పేజీ ప్రాధాన్యతను వివరించడంతో పాటు వివిధ రకాల రికార్డులను పరిశీలించారు.

తరగతి గది పరిశీలన సందర్భంగా విద్యార్థుల గుణాత్మక ప్రగతికి ఉపాధ్యాయులు చేస్తున్న కృషిని బృంద సభ్యులు ప్రశంసించారు. తరగతి గదిలో ఉపాధ్యాయులు–విద్యార్థుల మధ్య కనిపించిన అనుబంధాన్ని ప్రత్యేకంగా అభినందించారు. అయితే విద్యార్థుల ఎన్రోల్మెంట్ పెంపుపై మరింత శ్రద్ధ అవసరమని అభిప్రాయపడ్డారు.

పాఠశాలలో గ్రంథాలయ గది ఉన్నప్పటికీ అవసరమైన పుస్తకాలు అందుబాటులో లేని అంశాన్ని బృందం గుర్తించింది. టీచర్ హ్యాండ్బుక్, పాఠ్యపుస్తకాలు, వర్క్‌బుక్‌ల మధ్య సమన్వయం ఉండాల్సిన అవసరాన్ని ఉపాధ్యాయులకు గుర్తుచేశారు. అలాగే పాఠశాల ఆవరణలో విశాలమైనIMG-20260209-WA0124 ఆట స్థలం ఉండటం విద్యార్థుల శారీరక, మానసిక అభివృద్ధికి దోహదపడుతుందని పేర్కొంటూ, దానిని సద్వినియోగం చేసుకోవాలని సూచనలు చేశారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

స్టేషన్ ఘనపూర్ మున్సిపాలిటీ ఎన్నికల్లో బీఎస్పీ అభ్యర్థులకు మద్దతుగా ఇబ్రం శేఖర్ ప్రచారం స్టేషన్ ఘనపూర్ మున్సిపాలిటీ ఎన్నికల్లో బీఎస్పీ అభ్యర్థులకు మద్దతుగా ఇబ్రం శేఖర్ ప్రచారం
స్టేషన్ ఘనపూర్,ఫిబ్రవరి09(తెలంగాణ ముచ్చట్లు): స్టేషన్ ఘనపూర్ మున్సిపాలిటీ ఎన్నికల్లో బహుజన్ సమాజ్ పార్టీ తరఫున 1, 9, 18 వార్డుల కౌన్సిలర్ అభ్యర్థులుగా పోటీ చేస్తున్న చింత...
వడ్డేపల్లి మున్సిపాలిటీ అభివృద్ధే నా లక్ష్యం
7, 25 వార్డుల అభివృద్ధికి కదిరే నాగమ్మ రాములు యాదవ్‌ను గెలిపించాలి 
విద్యార్థుల ఎన్రోల్మెంట్ పెంపుపై మరింత శ్రద్ధ అవసరం
గంగిరెద్దుల కుటుంబాలకు విద్యుత్ సౌకర్యం
ప్రజా సమస్యల పరిష్కారంలో జర్నలిస్టుల పాత్ర కీలకం
కాంగ్రెస్ పార్టీతోనే పట్టణాల అభివృద్ధి సాధ్యం