చేర్యాల పట్టణ అభివృద్ధే నా లక్ష్యం
ముస్త్యాల అరుణ బాల నర్సయ్య, 6వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి
సిద్దిపేట, ఫిబ్రవరి 09 (తెలంగాణ ముచ్చట్లు):
చేర్యాల మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ మద్దతుతో 6వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థిగా బరిలో ఉన్న ముస్త్యాల అరుణ బాల నర్సయ్య ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆరో వార్డు పరిధిలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వార్డు ప్రజలను అనురాగపూర్వకంగా కలుసుకుంటూ, ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటు వేసి తనను గెలిపించాలని కోరారు.
ప్రజల సమస్యలపై ప్రత్యక్షంగా స్పందిస్తూ, నిస్వార్థ సేవకురాలిగా పనిచేస్తానని ఆమె తెలిపారు. ఆరో వార్డును అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి చూపిస్తానని హామీ ఇచ్చారు. ప్రజలకు ఏ సమస్య ఎదురైనా వారి వద్దకే వెళ్లి పరిష్కారం చూపిస్తానని, చేర్యాల పట్టణాన్ని సమగ్ర అభివృద్ధి దిశగా నడిపిస్తానని అన్నారు. “మీ ఓటే నా బలం, మీరే నా బలగం” అని పేర్కొన్నారు.ఆరో వార్డులో సీసీ రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ, వీధి దీపాలు, రేషన్ కార్డుల మంజూరు, పెన్షన్ల మంజూరుపై ప్రత్యేక దృష్టి సారించి అభివృద్ధి కార్యక్రమాలు చేపడతానని ఆమె తెలిపారు.ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, వార్డు ప్రజలు పాల్గొన్నారు.


Comments