జ్యోతిర్ముడి కార్యక్రమంలో పాల్గొన్న పామిరెడ్డిపల్లి సర్పంచ్ మధిర మంజుల శ్రీశైలం

జ్యోతిర్ముడి కార్యక్రమంలో పాల్గొన్న పామిరెడ్డిపల్లి సర్పంచ్ మధిర మంజుల శ్రీశైలం

పెద్దమందడి, (తెలంగాణ ముచ్చట్లు):

పెద్దమందడి మండలం పామిరెడ్డిపల్లి గ్రామంలో ఉన్న వైరాగ్యగిరి శివాలయంలో నిర్వహించిన జ్యోతిర్ముడి కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ మధిర మంజుల శ్రీశైలం పాల్గొన్నారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గౌరయ్య దాసు హాజరై శివయ్యకు ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారి ఆశీస్సులు తీసుకున్నారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, పరమశివుని ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని, ప్రతి ఒక్కరి జీవితంలో సుఖశాంతులు వెల్లివిరియాలని కోరుకున్నారు. జ్యోతిర్ముడి కార్యక్రమం సందర్భంగా శివ నామస్మరణతో ఆ ప్రాంతమంతా ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది.అలాగే సర్పంచ్ మధిర మంజుల శ్రీశైలం ఆధ్వర్యంలో జ్యోతిర్ముడి కార్యక్రమం సందర్భంగా మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించి భక్తులకు స్వయంగా అన్నదాన వితరణ చేశారు.ఈ కార్యక్రమంలో గ్రామ ఉపసర్పంచ్ రాములమ్మ, మాజీ సర్పంచ్ తిక్కన్న, మాజీ ఎంపీటీసీ ఇందిరా లక్ష్మారెడ్డి, వార్డు సభ్యులు, గ్రామ పెద్దలు, శివ స్వాములు, గురు స్వాములు, గ్రామ ప్రజలు, యువకులు, మహిళలు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

స్టేషన్ ఘనపూర్ మున్సిపాలిటీ ఎన్నికల్లో బీఎస్పీ అభ్యర్థులకు మద్దతుగా ఇబ్రం శేఖర్ ప్రచారం స్టేషన్ ఘనపూర్ మున్సిపాలిటీ ఎన్నికల్లో బీఎస్పీ అభ్యర్థులకు మద్దతుగా ఇబ్రం శేఖర్ ప్రచారం
స్టేషన్ ఘనపూర్,ఫిబ్రవరి09(తెలంగాణ ముచ్చట్లు): స్టేషన్ ఘనపూర్ మున్సిపాలిటీ ఎన్నికల్లో బహుజన్ సమాజ్ పార్టీ తరఫున 1, 9, 18 వార్డుల కౌన్సిలర్ అభ్యర్థులుగా పోటీ చేస్తున్న చింత...
వడ్డేపల్లి మున్సిపాలిటీ అభివృద్ధే నా లక్ష్యం
7, 25 వార్డుల అభివృద్ధికి కదిరే నాగమ్మ రాములు యాదవ్‌ను గెలిపించాలి 
విద్యార్థుల ఎన్రోల్మెంట్ పెంపుపై మరింత శ్రద్ధ అవసరం
గంగిరెద్దుల కుటుంబాలకు విద్యుత్ సౌకర్యం
ప్రజా సమస్యల పరిష్కారంలో జర్నలిస్టుల పాత్ర కీలకం
కాంగ్రెస్ పార్టీతోనే పట్టణాల అభివృద్ధి సాధ్యం