డ్రైవర్లు, కార్మికుల సమస్యల పరిష్కారమే లక్ష్యం

డ్రైవర్లు, కార్మికుల సమస్యల పరిష్కారమే లక్ష్యం

— తెలంగాణ రాష్ట్ర రవాణా డ్రైవర్లు, కార్మికుల సంఘం రాష్ట్ర కార్యదర్శిగా దయ్యాల దాసు

పెద్దమందడి,ఫిబ్రవరి10(తెలంగాణ ముచ్చట్లు):

హైదరాబాద్ నారాయణగూడలోని ఐఎన్‌టీయూసీ భవన్‌లో మంగళవారం తెలంగాణ రాష్ట్ర రవాణా డ్రైవర్లు, కార్మికుల సంఘం రాష్ట్ర కార్యదర్శిగా దయ్యాల దాసును నియమిస్తూ నియామక పత్రాన్ని సంఘం ప్రధాన కార్యదర్శి గోదా మల్లేష్ అందజేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమం ఉత్సాహభరితంగా జరిగింది.ఈ సందర్భంగా దయ్యాల దాసు మాట్లాడుతూ.. తనపై ఉంచిన నమ్మకానికి ధన్యవాదాలు తెలిపారు.తనకు ఈ బాధ్యత అప్పగించిన ఐఎన్‌టీయూసీ జాతీయ అధ్యక్షులు సంజీవరెడ్డి, రాష్ట్ర అధ్యక్షులు నరసింహారెడ్డి, ఉపాధ్యక్షులు రాజేందర్ రెడ్డి, కార్యనిర్వాహక అధ్యక్షులు రామకృష్ణారెడ్డి, ప్రధాన కార్యదర్శి గోదా మల్లేష్‌లకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.డ్రైవర్లు, కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను ఎప్పటికప్పుడు సంఘం అధినాయకత్వం దృష్టికి తీసుకెళ్లి, వాటి పరిష్కారానికి నిరంతరం పోరాడతానని తెలిపారు. కార్మికుల హక్కుల పరిరక్షణతో పాటు వారి సంక్షేమమే తన ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు.రాష్ట్రవ్యాప్తంగా డ్రైవర్లు, కార్మికులకు సంఘం బలంగా అండగా నిలుస్తుందని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో సంఘ నాయకులు, సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొని దయ్యాల దాసును అభినందించారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

కీసరగుట్ట బ్రహ్మోత్సవాలకు సీఎం రేవంత్‌రెడ్డికి ఆహ్వానం కీసరగుట్ట బ్రహ్మోత్సవాలకు సీఎం రేవంత్‌రెడ్డికి ఆహ్వానం
కీసర, ఫిబ్రవరి 10 (తెలంగాణ ముచ్చట్లు): మహాశివరాత్రి సందర్భంగా మేడ్చల్ జిల్లా కీసరగుట్టలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ భవాని శివదుర్గ సమేత రామలింగేశ్వర స్వామి ఆలయంలో నిర్వహించనున్న...
ఉప్పల్‌లో రూ.110 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన
మేయర్ గద్వాల విజయలక్ష్మికి పత్తి కుమార్ ప్రత్యేక కృతజ్ఞతలు
సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం
మున్సిపల్ ఎన్నికల ఏర్పాట్లపై కలెక్టర్ మను చౌదరి పరిశీలన
గోపాల్‌పూర్‌ ఆదర్శ పురుషుల పొదుపు సంఘం నుంచి ఆర్థిక భరోసా
గోగికార్ శివకుమార్ జన్మదిన సందర్భంగా కాప్రా డివిజన్‌లో సేవా కార్యక్రమాలు