కబ్జాదారుల నుంచి ఫుట్బాల్ గ్రౌండ్కు రక్షణ
సీఎం రేవంత్రెడ్డికి అల్వాల్ మాజీ మున్సిపల్ చైర్మన్ జీవన్ కృతజ్ఞతలు
కాప్రా–యాప్రాల్, ఫిబ్రవరి 10 (తెలంగాణ ముచ్చట్లు):
ఉప్పల్ నియోజకవర్గ కాప్రా డివిజన్ లో భూ కబ్జాదారుల నుంచి ఫుట్బాల్ గ్రౌండ్ను పరిరక్షించి, దాని అభివృద్ధికి రూ.6 కోట్ల నిధులు మంజూరు చేసిన ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి అల్వాల్ మున్సిపల్ మాజీ చైర్మన్ జీవన్ కృతజ్ఞతలు తెలిపారు.కాప్రా–యాప్రాల్ ప్రాంతంలో నూతనంగా అభివృద్ధి చేయనున్న ఫుట్బాల్ గ్రౌండ్కు మంగళవారం రాష్ట్ర మంత్రి శ్రీధర్ బాబు, ఉప్పల్ ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డి, ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి, స్థానిక కార్పొరేటర్ స్వర్ణరాజ్ శంకుస్థాపన చేశారు.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, గత 60 సంవత్సరాలుగా ఉన్న ఈ ఫుట్బాల్ గ్రౌండ్కు నేడు అభివృద్ధి లభించడం శుభసూచకమని అన్నారు. గ్రౌండ్ అభివృద్ధి పూర్తయితే ఫుట్బాల్ క్రీడాకారులకు ఆధునిక సౌకర్యాలు అందుబాటులోకి వస్తాయని తెలిపారు.స్థానిక యువతతో పాటు క్రీడాకారులకు ఈ గ్రౌండ్ ఎంతో ఉపయోగపడనుందని, క్రీడలకు ప్రాధాన్యతనిచ్చే దిశగా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు ఇది నిదర్శనమని నాయకులు అభిప్రాయపడ్డారు.


Comments