కబ్జాదారుల నుంచి ఫుట్‌బాల్ గ్రౌండ్‌కు రక్షణ

సీఎం రేవంత్‌రెడ్డికి అల్వాల్ మాజీ మున్సిపల్ చైర్మన్ జీవన్ కృతజ్ఞతలు

కబ్జాదారుల నుంచి ఫుట్‌బాల్ గ్రౌండ్‌కు రక్షణ

 కాప్రా–యాప్రాల్, ఫిబ్రవరి 10 (తెలంగాణ ముచ్చట్లు):

ఉప్పల్ నియోజకవర్గ కాప్రా డివిజన్ లో భూ కబ్జాదారుల నుంచి ఫుట్‌బాల్ గ్రౌండ్‌ను పరిరక్షించి, దాని అభివృద్ధికి రూ.6 కోట్ల నిధులు మంజూరు చేసిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి అల్వాల్ మున్సిపల్ మాజీ చైర్మన్ జీవన్ కృతజ్ఞతలు తెలిపారు.కాప్రా–యాప్రాల్ ప్రాంతంలో నూతనంగా అభివృద్ధి చేయనున్న ఫుట్‌బాల్ గ్రౌండ్‌కు మంగళవారం రాష్ట్ర మంత్రి శ్రీధర్ బాబు, ఉప్పల్ ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డి, ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి, స్థానిక కార్పొరేటర్ స్వర్ణరాజ్ శంకుస్థాపన చేశారు.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, గత 60 సంవత్సరాలుగా ఉన్న ఈ ఫుట్‌బాల్ గ్రౌండ్‌కు నేడు అభివృద్ధి లభించడం శుభసూచకమని అన్నారు. గ్రౌండ్ అభివృద్ధి పూర్తయితే ఫుట్‌బాల్ క్రీడాకారులకు ఆధునిక సౌకర్యాలు అందుబాటులోకి వస్తాయని తెలిపారు.స్థానిక యువతతో పాటు క్రీడాకారులకు ఈ గ్రౌండ్ ఎంతో ఉపయోగపడనుందని, క్రీడలకు ప్రాధాన్యతనిచ్చే దిశగా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు ఇది నిదర్శనమని నాయకులు అభిప్రాయపడ్డారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

కీసరగుట్ట బ్రహ్మోత్సవాలకు సీఎం రేవంత్‌రెడ్డికి ఆహ్వానం కీసరగుట్ట బ్రహ్మోత్సవాలకు సీఎం రేవంత్‌రెడ్డికి ఆహ్వానం
కీసర, ఫిబ్రవరి 10 (తెలంగాణ ముచ్చట్లు): మహాశివరాత్రి సందర్భంగా మేడ్చల్ జిల్లా కీసరగుట్టలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ భవాని శివదుర్గ సమేత రామలింగేశ్వర స్వామి ఆలయంలో నిర్వహించనున్న...
ఉప్పల్‌లో రూ.110 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన
మేయర్ గద్వాల విజయలక్ష్మికి పత్తి కుమార్ ప్రత్యేక కృతజ్ఞతలు
సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం
మున్సిపల్ ఎన్నికల ఏర్పాట్లపై కలెక్టర్ మను చౌదరి పరిశీలన
గోపాల్‌పూర్‌ ఆదర్శ పురుషుల పొదుపు సంఘం నుంచి ఆర్థిక భరోసా
గోగికార్ శివకుమార్ జన్మదిన సందర్భంగా కాప్రా డివిజన్‌లో సేవా కార్యక్రమాలు