మున్సిపల్ ఎన్నికల ఏర్పాట్లపై కలెక్టర్ మను చౌదరి పరిశీలన

మున్సిపల్ ఎన్నికల ఏర్పాట్లపై కలెక్టర్ మను చౌదరి పరిశీలన

మేడ్చల్–మల్కాజ్గిరి, ఫిబ్రవరి 10 (తెలంగాణ ముచ్చట్లు):

మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్‌ల సాధారణ ఎన్నికలు–2026 నేపథ్యంలో మేడ్చల్–మల్కాజ్గిరి జిల్లాలో ఎన్నికల ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ మను చౌదరి పరిశీలించారు. సాధారణ ఎన్నికల పరిశీలకులు నిర్మల కాంతి వెస్లేతో కలిసి మూడుచింతలపల్లి, ఆలియాబాద్, ఎల్లంపేట్ మున్సిపాలిటీలలో ఎన్నికలకు ఉపయోగించే సామాగ్రి డిస్ట్రిబ్యూషన్ సెంటర్లను మంగళవారం తనిఖీ చేశారు.ఈ సందర్భంగా ఆయా మున్సిపాలిటీల్లో ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్ సెంటర్లు, స్ట్రాంగ్ రూమ్స్, కౌంటింగ్ సెంటర్లను కలెక్టర్ పరిశీలించి ఏర్పాట్లపై అధికారులకు పలు సూచనలు చేశారు. ఎన్నికల సామాగ్రి, ఎన్నికల సిబ్బంది నిర్ణీత సమయంలో పోలింగ్ బూతులకు చేరుకునేలా ముందస్తు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా, సజావుగా నిర్వహించేందుకు అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేయాలని ఎన్నికల సిబ్బందికి కలెక్టర్ సూచించారు. స్ట్రాంగ్ రూమ్స్, కౌంటింగ్ సెంటర్ల వద్ద గట్టి బందోబస్తు ఏర్పాటు చేయాలని, ప్రతి కౌంటింగ్ టేబుల్ వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి నిరంతర పర్యవేక్షణఉండేలా చర్యలు చేపట్టాలని తెలిపారు.IMG-20260210-WA0082

Tags:

Post Your Comments

Comments

Latest News

కీసరగుట్ట బ్రహ్మోత్సవాలకు సీఎం రేవంత్‌రెడ్డికి ఆహ్వానం కీసరగుట్ట బ్రహ్మోత్సవాలకు సీఎం రేవంత్‌రెడ్డికి ఆహ్వానం
కీసర, ఫిబ్రవరి 10 (తెలంగాణ ముచ్చట్లు): మహాశివరాత్రి సందర్భంగా మేడ్చల్ జిల్లా కీసరగుట్టలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ భవాని శివదుర్గ సమేత రామలింగేశ్వర స్వామి ఆలయంలో నిర్వహించనున్న...
ఉప్పల్‌లో రూ.110 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన
మేయర్ గద్వాల విజయలక్ష్మికి పత్తి కుమార్ ప్రత్యేక కృతజ్ఞతలు
సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం
మున్సిపల్ ఎన్నికల ఏర్పాట్లపై కలెక్టర్ మను చౌదరి పరిశీలన
గోపాల్‌పూర్‌ ఆదర్శ పురుషుల పొదుపు సంఘం నుంచి ఆర్థిక భరోసా
గోగికార్ శివకుమార్ జన్మదిన సందర్భంగా కాప్రా డివిజన్‌లో సేవా కార్యక్రమాలు