పుట్టినరోజు సందర్భంగా ఆసుపత్రిలో రోగులకు పండ్ల పంపిణీ చేసిన బండారు శ్రీనివాస్

పుట్టినరోజు సందర్భంగా ఆసుపత్రిలో రోగులకు పండ్ల పంపిణీ చేసిన బండారు శ్రీనివాస్

వనపర్తి,ఫిబ్రవరి10(తెలంగాణ ముచ్చట్లు):

జైభేం సేవా సొసైటీ అధ్యక్షులు బండారు శ్రీనివాస్ తన 53వ పుట్టినరోజు సందర్భంగా మంగళవారం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగులకు పండ్లను పంపిణీ చేశారు. పుట్టినరోజును ఆర్భాటాలు, కేక్ కటింగ్‌లు, పార్టీలతో కాకుండా సమాజానికి ఉపయోగపడే సేవా కార్యక్రమాలతో నిర్వహించడం ఆయనకు ప్రత్యేకతగా నిలిచింది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సాహితీ కళా వేదిక వనపర్తి జిల్లా అధ్యక్షులు పలుస శంకర్ గౌడ్ మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ పుట్టినరోజుల సందర్భంలో అనవసర ఖర్చులు చేయకుండా, బండారు శ్రీనివాస్ మాదిరిగా సమాజానికి మేలు చేసే కార్యక్రమాలు చేపట్టాలని పిలుపునిచ్చారు. పుట్టుక, చావు నీది… బ్రతుకంతా సమాజనిధి అనే భావనతో అందరూ సమాజ ఉన్నతి కోసం కృషి చేయాలని అన్నారు.సమాజం కోసం నిరంతరం పనిచేసే వ్యక్తులను సమాజం ఎప్పటికీ గుర్తుంచుకుంటుందని, సేవా భావనతో ముందుకు వచ్చే వారే నిజమైన నాయకులని ఆయన ప్రశంసించారు.ఈ కార్యక్రమంలో కవి జనజ్వాల, భాలస్వామి, స్వామి, సురేందర్ తదితరులు పాల్గొని బండారు శ్రీనివాస్‌ను అభినందించారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

కీసరగుట్ట బ్రహ్మోత్సవాలకు సీఎం రేవంత్‌రెడ్డికి ఆహ్వానం కీసరగుట్ట బ్రహ్మోత్సవాలకు సీఎం రేవంత్‌రెడ్డికి ఆహ్వానం
కీసర, ఫిబ్రవరి 10 (తెలంగాణ ముచ్చట్లు): మహాశివరాత్రి సందర్భంగా మేడ్చల్ జిల్లా కీసరగుట్టలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ భవాని శివదుర్గ సమేత రామలింగేశ్వర స్వామి ఆలయంలో నిర్వహించనున్న...
ఉప్పల్‌లో రూ.110 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన
మేయర్ గద్వాల విజయలక్ష్మికి పత్తి కుమార్ ప్రత్యేక కృతజ్ఞతలు
సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం
మున్సిపల్ ఎన్నికల ఏర్పాట్లపై కలెక్టర్ మను చౌదరి పరిశీలన
గోపాల్‌పూర్‌ ఆదర్శ పురుషుల పొదుపు సంఘం నుంచి ఆర్థిక భరోసా
గోగికార్ శివకుమార్ జన్మదిన సందర్భంగా కాప్రా డివిజన్‌లో సేవా కార్యక్రమాలు