మేయర్ గద్వాల విజయలక్ష్మికి పత్తి కుమార్ ప్రత్యేక కృతజ్ఞతలు

మేయర్ గద్వాల విజయలక్ష్మికి పత్తి కుమార్ ప్రత్యేక కృతజ్ఞతలు

కాప్రా, ఫిబ్రవరి 10 (తెలంగాణ ముచ్చట్లు):

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌లో ఐదు సంవత్సరాల పాటు ప్రజా సమస్యలను సమర్థవంతంగా పరిష్కరిస్తూ పరిపాలన సాగించిన కార్పొరేటర్లకు, ముఖ్యంగా మేయర్ గద్వాల విజయలక్ష్మి కి కాంటెస్టెడ్ కాంగ్రెస్ కార్పొరేటర్ పత్తి కుమార్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.మేయర్‌గా తన పదవీకాలంలో ప్రజా సేవను ప్రధాన లక్ష్యంగా పెట్టుకొని నగరాభివృద్ధికి కృషి చేసిన తీరు అభినందనీయమని ఆయన పేర్కొన్నారు. పదవీ కాలం ముగిసినప్పటికీ, ప్రజలతో అనుబంధం కొనసాగిస్తూ సేవా కార్యక్రమాల్లో ముందుండాలని ఆకాంక్షించారు.ప్రజల సమస్యలపై స్పందించే నాయకత్వం అవసరమని, భవిష్యత్తులో కూడా మేయర్ గద్వాల విజయలక్ష్మి ప్రజా సేవా రంగంలో క్రియాశీలకంగా కొనసాగాలని పత్తి కుమార్ ఆశాభావం వ్యక్తం చేశారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

కీసరగుట్ట బ్రహ్మోత్సవాలకు సీఎం రేవంత్‌రెడ్డికి ఆహ్వానం కీసరగుట్ట బ్రహ్మోత్సవాలకు సీఎం రేవంత్‌రెడ్డికి ఆహ్వానం
కీసర, ఫిబ్రవరి 10 (తెలంగాణ ముచ్చట్లు): మహాశివరాత్రి సందర్భంగా మేడ్చల్ జిల్లా కీసరగుట్టలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ భవాని శివదుర్గ సమేత రామలింగేశ్వర స్వామి ఆలయంలో నిర్వహించనున్న...
ఉప్పల్‌లో రూ.110 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన
మేయర్ గద్వాల విజయలక్ష్మికి పత్తి కుమార్ ప్రత్యేక కృతజ్ఞతలు
సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం
మున్సిపల్ ఎన్నికల ఏర్పాట్లపై కలెక్టర్ మను చౌదరి పరిశీలన
గోపాల్‌పూర్‌ ఆదర్శ పురుషుల పొదుపు సంఘం నుంచి ఆర్థిక భరోసా
గోగికార్ శివకుమార్ జన్మదిన సందర్భంగా కాప్రా డివిజన్‌లో సేవా కార్యక్రమాలు