మేయర్ గద్వాల విజయలక్ష్మికి పత్తి కుమార్ ప్రత్యేక కృతజ్ఞతలు
Views: 4
On
కాప్రా, ఫిబ్రవరి 10 (తెలంగాణ ముచ్చట్లు):
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో ఐదు సంవత్సరాల పాటు ప్రజా సమస్యలను సమర్థవంతంగా పరిష్కరిస్తూ పరిపాలన సాగించిన కార్పొరేటర్లకు, ముఖ్యంగా మేయర్ గద్వాల విజయలక్ష్మి కి కాంటెస్టెడ్ కాంగ్రెస్ కార్పొరేటర్ పత్తి కుమార్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.మేయర్గా తన పదవీకాలంలో ప్రజా సేవను ప్రధాన లక్ష్యంగా పెట్టుకొని నగరాభివృద్ధికి కృషి చేసిన తీరు అభినందనీయమని ఆయన పేర్కొన్నారు. పదవీ కాలం ముగిసినప్పటికీ, ప్రజలతో అనుబంధం కొనసాగిస్తూ సేవా కార్యక్రమాల్లో ముందుండాలని ఆకాంక్షించారు.ప్రజల సమస్యలపై స్పందించే నాయకత్వం అవసరమని, భవిష్యత్తులో కూడా మేయర్ గద్వాల విజయలక్ష్మి ప్రజా సేవా రంగంలో క్రియాశీలకంగా కొనసాగాలని పత్తి కుమార్ ఆశాభావం వ్యక్తం చేశారు.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
10 Feb 2026 21:45:01
కీసర, ఫిబ్రవరి 10 (తెలంగాణ ముచ్చట్లు):
మహాశివరాత్రి సందర్భంగా మేడ్చల్ జిల్లా కీసరగుట్టలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ భవాని శివదుర్గ సమేత రామలింగేశ్వర స్వామి ఆలయంలో నిర్వహించనున్న...


Comments