సత్తుపల్లిలో ఎన్నికల బందోబస్తుపై పోలీసుల బ్రీఫింగ్.

సత్తుపల్లిలో ఎన్నికల బందోబస్తుపై పోలీసుల బ్రీఫింగ్.

- కట్టుదిట్టమైన భద్రత.
- చట్టవ్యతిరేక చర్యలపై కఠిన చర్యలు.

సత్తుపల్లి, ఫిబ్రవరి10 (తెలంగాణ ముచ్చట్లు):IMG-20260210-WA0034

ఈ నెల11వ తేదీన జరగబోయే సత్తుపల్లి మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల విధులకు హాజరైన పోలీసు సిబ్బందికి డ్యూటీలో పాటించాల్సిన విధులు, జాగ్రత్తలపై కల్లూరు ఏసీపీ వసుంధర యాదవ్ మరియు సత్తుపల్లి ఎస్‌హెచ్‌వో తుమ్మలపల్లి శ్రీహరి బ్రీఫింగ్ నిర్వహించారు. ఎన్నికలు ప్రశాంతంగా, నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. ఈ బందోబస్తులో 3 మంది ఏసీపీలు, 3 మంది సీఐలు, 12 మంది ఎస్‌ఐలు, అలాగే సుమారు 200 మంది పోలీసు సిబ్బంది పాల్గొంటున్నారని వెల్లడించారు.
ఎన్నికల కోడ్ అమలులో ఉండటంతో పాటు జిల్లాలో 163/బీఎన్‌ఎస్‌ఎస్ అమలులో ఉన్నందున ప్రజలు గుంపులుగా చేరినా, చట్టవ్యతిరేక చర్యలకు పాల్పడినా చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎన్నికల నిర్వహణలో పోలీసు సిబ్బందికి ప్రజలు పూర్తి స్థాయిలో సహకరించాలని సత్తుపల్లి పోలీసు శాఖ విజ్ఞప్తి చేసింది.

Tags:

Post Your Comments

Comments

Latest News

కీసరగుట్ట బ్రహ్మోత్సవాలకు సీఎం రేవంత్‌రెడ్డికి ఆహ్వానం కీసరగుట్ట బ్రహ్మోత్సవాలకు సీఎం రేవంత్‌రెడ్డికి ఆహ్వానం
కీసర, ఫిబ్రవరి 10 (తెలంగాణ ముచ్చట్లు): మహాశివరాత్రి సందర్భంగా మేడ్చల్ జిల్లా కీసరగుట్టలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ భవాని శివదుర్గ సమేత రామలింగేశ్వర స్వామి ఆలయంలో నిర్వహించనున్న...
ఉప్పల్‌లో రూ.110 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన
మేయర్ గద్వాల విజయలక్ష్మికి పత్తి కుమార్ ప్రత్యేక కృతజ్ఞతలు
సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం
మున్సిపల్ ఎన్నికల ఏర్పాట్లపై కలెక్టర్ మను చౌదరి పరిశీలన
గోపాల్‌పూర్‌ ఆదర్శ పురుషుల పొదుపు సంఘం నుంచి ఆర్థిక భరోసా
గోగికార్ శివకుమార్ జన్మదిన సందర్భంగా కాప్రా డివిజన్‌లో సేవా కార్యక్రమాలు