ఎల్కతుర్తి మండలంలో మైక్రో ఫైనాన్స్ సంస్థల దౌర్జన్యo

ఎల్కతుర్తి మండలంలో మైక్రో ఫైనాన్స్ సంస్థల దౌర్జన్యo

ఎల్కతుర్తి, ఫిబ్రవరి 11 (తెలంగాణ ముచ్చట్లు):

హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండలం దామెర గ్రామంలో మైక్రో ఫైనాన్స్ సంస్థల అనుచిత ప్రవర్తన తీవ్ర ఆందోళనకు దారితీసింది. రుణ వాయిదాల వసూళ్ల పేరుతో సోమవారం రాత్రి ఆలస్యంగా కస్టమర్ల ఇళ్లకు వెళ్లిన సంస్థ సిబ్బంది దురుసుగా ప్రవర్తించినట్లు ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి.
బాధితుల వివరాల ప్రకారం, రాత్రి 9 గంటల తర్వాత ఇళ్లకు చేరుకున్న సిబ్బంది మహిళలు, కుటుంబ సభ్యుల సమక్షంలో అవమానకరంగా మాట్లాడి మానసిక ఒత్తిడికి గురిచేశారని తెలిపారు. అసభ్య పదజాలంతో బెదిరింపులకు పాల్పడినట్లు వారు వాపోతున్నారు.
అంతేకాకుండా, పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేస్తామని హెచ్చరిస్తూ ఒత్తిడి తెచ్చినట్లు గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. రాత్రి వేళల్లో వసూళ్లు చేయడం చట్టవిరుద్ధమని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఈ ఘటనపై సంబంధిత అధికారుల దృష్టికి విషయం తీసుకెళ్లి, మైక్రో ఫైనాన్స్ సంస్థలపై కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. రాత్రి వేళ వసూళ్లపై స్పష్టమైన నిషేధం అమలు చేయాలని కోరుతున్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

ఓటు హక్కు వినియోగించుకున్న ఐదో వార్డు అభ్యర్థి ఎన్ యుగేందర్ రెడ్డి  ఓటు హక్కు వినియోగించుకున్న ఐదో వార్డు అభ్యర్థి ఎన్ యుగేందర్ రెడ్డి 
వడ్డేపల్లి,ఫిబ్రవరి11(తెలంగాణ ముచ్చట్లు) : వడ్డేపల్లి మున్సిపల్ ఎన్నికల సందర్భంగా ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ తరఫున ఐదో వార్డు కౌన్సిలర్ అభ్యర్థి ఎన్ యుగేందర్ రెడ్డి తన...
నేరెడ్‌మెట్ డివిజన్‌లో 5 సంవత్సరాల అభివృద్ధి స్వర్ణయుగం
ఆశా వర్కర్లకు వేతనాలు వెంటనే చెల్లించాలి
ప్రశాంతంగా కొనసాగుతున్న ఐదు మున్సిపాలిటీల ఎన్నికల పక్రియ
నాగిలిగొండ గ్రామంలో పశు వైద్య శిబిరం.
కీసరగుట్ట బ్రహ్మోత్సవాలు.. ఈసారి వీఐపీ పాస్‌లు లేవు
ఎడిషన్, డార్విన్ జయంతి సందర్భంగా వైజ్ఞానిక నీరాజనం