ఓటు హక్కు వినియోగించుకున్న ఐదో వార్డు అభ్యర్థి ఎన్ యుగేందర్ రెడ్డి 

ఓటు హక్కు వినియోగించుకున్న ఐదో వార్డు అభ్యర్థి ఎన్ యుగేందర్ రెడ్డి 

వడ్డేపల్లి,ఫిబ్రవరి11(తెలంగాణ ముచ్చట్లు) :

వడ్డేపల్లి మున్సిపల్ ఎన్నికల సందర్భంగా ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ తరఫున ఐదో వార్డు కౌన్సిలర్ అభ్యర్థి ఎన్ యుగేందర్ రెడ్డి తన కుటుంబ సభ్యులతో కలిసి బుధవారం ఓటు హక్కును వినియోగించుకున్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారత రాజ్యాంగం ప్రతి పౌరుడికి కల్పించిన ఓటు హక్కు అమూల్యమైనదని తెలిపారు. రాజ్యాంగ నిర్మాత బాబా సాహెబ్ అంబేద్కర్ సూచించిన మార్గంలో ప్రజాస్వామ్య వ్యవస్థ బలపడాలంటే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తమ ఓటును వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. ముఖ్యంగా యువత పెద్ద ఎత్తున ముందుకు వచ్చి తమ హక్కును చాటుకోవాలని పేర్కొన్నారు.ఎన్నికల నిర్వహణలో భాగంగా శాంతినగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో విధులు నిర్వహించిన సిబ్బంది శాంతి భద్రతలు కాపాడుతూ కృషి చేయడంతో వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

ఓటు హక్కు వినియోగించుకున్న ఐదో వార్డు అభ్యర్థి ఎన్ యుగేందర్ రెడ్డి  ఓటు హక్కు వినియోగించుకున్న ఐదో వార్డు అభ్యర్థి ఎన్ యుగేందర్ రెడ్డి 
వడ్డేపల్లి,ఫిబ్రవరి11(తెలంగాణ ముచ్చట్లు) : వడ్డేపల్లి మున్సిపల్ ఎన్నికల సందర్భంగా ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ తరఫున ఐదో వార్డు కౌన్సిలర్ అభ్యర్థి ఎన్ యుగేందర్ రెడ్డి తన...
నేరెడ్‌మెట్ డివిజన్‌లో 5 సంవత్సరాల అభివృద్ధి స్వర్ణయుగం
ఆశా వర్కర్లకు వేతనాలు వెంటనే చెల్లించాలి
ప్రశాంతంగా కొనసాగుతున్న ఐదు మున్సిపాలిటీల ఎన్నికల పక్రియ
నాగిలిగొండ గ్రామంలో పశు వైద్య శిబిరం.
కీసరగుట్ట బ్రహ్మోత్సవాలు.. ఈసారి వీఐపీ పాస్‌లు లేవు
ఎడిషన్, డార్విన్ జయంతి సందర్భంగా వైజ్ఞానిక నీరాజనం