ప్రశాంతంగా కొనసాగుతున్న ఐదు మున్సిపాలిటీల ఎన్నికల పక్రియ
పోలింగ్ సరళి, పోలీస్ బందోబస్త్ పరిశీంచిన పోలీస్ కమిషనర్
ఖమ్మం బ్యూరో, ఫిబ్రవరి 11(తెలంగాణ ముచ్చట్లు)
జిల్లాలో కొనసాగుతున్న ఐదు మున్సిపాలిటీ ఎన్నికలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయని పోలీస్ కమిషనర్ సునీల్ దత్ తెలిపారు. ఎదులాపురం, వైరా, కల్లూరు, మధిర, సత్తుపల్లి మున్సిపాలిటీలో కొనసాగుతున్న ఎన్నికల నేపథ్యంలో పలు పోలింగ్ స్టేషన్లను పోలీస్ కమిషనర్ సందర్శించారు. పోలీస్ బందోబస్త్ ఎన్నికల భద్రత ఏర్పాట్లను పరిశీలించారు. అడిషనల్ డీసీపీ ప్రసాద్ రావు, రామానుజం, కల్లూరు ఏసీపీ వసుంధర యాదవ్ తో పోలింగ్ పక్రియ, బందోబస్త్ ఏర్పాట్లపై చర్చించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా పోలీస్ అధికారులకు దిశా నిర్దేశం చేశారు. పోలింగ్ కేంద్రాల వద్ద క్యూలైన్ పాటించేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఎన్నికలు పూర్తిగా ప్రశాంత వాతావరణంలో స్వేచ్ఛా
యుతంగా నిర్వహించేందుకు
అవసరమైన అన్ని రకాల చర్యలను తీసుకోవాలని, పోలీస్ అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రజలు శాంతియుత
వాతావరణంలో తమ ఓటు హక్కును వినియోగించుకునేలా పటిష్టమైన భద్రత ఏర్పాటు చేశామని తెలిపారు.


Comments