కమిషనర్ వినయ్ కృష్ణారెడ్డిని కలిసిన పత్తి కుమార్
Views: 26
On
మల్కాజిగిరి, ఫిబ్రవరి 12 (తెలంగాణ ముచ్చట్లు):
మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్గా పదవీ బాధ్యతలు స్వీకరించిన వినయ్ కృష్ణారెడ్డిని మేడ్చల్ జిల్లా ఎస్సీ విభాగం అధ్యక్షులు, కాప్రా ఉమ్మడి డివిజన్ కాంగ్రెస్ కాంటెస్టెడ్ కార్పొరేటర్ పత్తి కుమార్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కమిషనర్కు పూల బొకే అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.నగర అభివృద్ధి, పారిశుధ్యం, మౌలిక సదుపాయాల మెరుగుదలపై ప్రత్యేక దృష్టి సారించాలని కమిషనర్ను కోరినట్లు పత్తి కుమార్ తెలిపారు. ప్రజల సమస్యల పరిష్కారంలో తమ వంతు సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో సింగం కిరణ్, సందీప్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
15 Aug 2026 21:27:41
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు):
వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...


Comments