దేహదానంతో అమరురాలైన వెంకమ్మ.!

దేహదానంతో అమరురాలైన వెంకమ్మ.!

- నేత్రదానంతో ఇద్దరికి చూపు.
- సర్పంచ్ దొడ్డా రాజేంద్ర ప్రసాద్ సహకారంతో.

సత్తుపల్లి, ఫిబ్రవరి 12 (తెలంగాణ ముచ్చట్లు):

స్థానిక మండలం బేతుపల్లి గ్రామానికి చెందిన నల్లమోతు వెంకమ్మ (82), (భర్త లేటు రాఘవయ్య), బుధవారం సాయంత్రం అనారోగ్యంతో కన్నుమూశారు. వెంకమ్మ పార్థివ దేహానికి బేతుపల్లి సర్పంచ్ దొడ్డా రాజేంద్ర ప్రసాద్ నివాళి అర్పించి, ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ, వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. అనంతరం ఆమె పార్థివ దేహం వైద్య విద్యార్థులకు విద్యాభ్యాసానికి ఉపయోగపడాలని, కుమార్తెలు బొంతు అనసూర్య (భర్త రామారావు), తన్నీరు పుష్పావతి (భర్త లింగయ్య)లతో మాట్లాడి, మరణానంతరం అగ్గిపాలయ్యే నేత్రాలను దానం చేసి మరో ఇద్దరికి ఉపయోగపడాలని సమాజానికి ఆదర్శంగా నిలవాలని పేర్కొన్నారు. కుటుంబ సభ్యుల సమ్మతితో సత్తుపల్లి లయన్స్ క్లబ్ నేత్రనిధి ఆధ్వర్యంలో వాహనం ఏర్పాటు చేసి, అనంతరం ఆమె పార్థివ దేహాన్ని కిమ్స్ మెడికల్ కళాశాల, నార్కెట్‌పల్లికి తరలించారు. గ్రామస్థులు సర్పంచ్ దొడ్డా రాజేంద్ర ప్రసాద్‌ను అభినందిస్తూ, ఆయన తీసుకున్న నిర్ణయం వైద్య విద్యార్థులకు ఉపయోగపడుతుందని పేర్కొంటూ వెంకమ్మ మృతికి సంతాపం వ్యక్తం చేశారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

బీజేపీ విధానాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్త సమ్మె – వనపర్తిలో భారీ నిరసన ర్యాలీ బీజేపీ విధానాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్త సమ్మె – వనపర్తిలో భారీ నిరసన ర్యాలీ
వనపర్తి,ఫిబ్రవరి12(తెలంగాణ ముచ్చట్లు): కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న ఉద్యోగ, కార్మిక, రైతు వ్యతిరేక విధానాలకు నిరసనగా దేశవ్యాప్తంగా నిర్వహించిన సమ్మెకు మద్దతుగా వనపర్తి జిల్లా కేంద్రంలో కార్మిక...
కల్లూరు మున్సిపల్ ఓట్ల లెక్కింపుకు పటిష్ట భద్రతా ఏర్పాట్లు.
రాధిక చౌరస్తాలో ఆటో కార్మికుల భారీ నిరసన
హరిత ఎంక్లేవ్‌లో మురుగునీటి సమస్యపై స్వర్ణరాజ్ శివమణి పర్యటన
హరిత ఎంక్లేవ్‌లో మురుగునీటి సమస్యపై స్వర్ణరాజ్ శివమణి పర్యటన
బండారి రాజిరెడ్డి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహణ
ఓటమి భయంతో గిఫ్టుల వసూలు?