మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ ప్రధమ కమిషనర్‌కు శుభాకాంక్షలు తెలిపిన  ఎమ్మెల్యే

మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ ప్రధమ కమిషనర్‌కు శుభాకాంక్షలు తెలిపిన  ఎమ్మెల్యే

నాచారం, ఫిబ్రవరి 12 (తెలంగాణ ముచ్చట్లు):

మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ తొలి కమిషనర్‌గా నియమితులైన వినయ్ కృష్ణారెడ్డి ఐఏఎస్‌ను ఉప్పల్ శాసనసభ్యులు బండారి లక్ష్మారెడ్డి మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. నాచారం లోని ఎంఎంసి కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే పూలబొకే అందజేసి అభినందనలు తెలియజేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మల్కాజిగిరి నగర అభివృద్ధి, మౌలిక వసతుల బలోపేతం, పారిశుధ్యం, తాగునీటి సరఫరా, రహదారుల మెరుగుదల వంటి అంశాల్లో సమన్వయంతో పనిచేయాలని కోరారు. ప్రజలకు పారదర్శకమైన, సమర్థవంతమైన పౌరసేవలు అందించేందుకు తమ వంతు సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో బారాస రాష్ట్ర నాయకులు సాయిజెన్ శేఖర్, బారాస నాయకులు విట్టల్ యాదవ్, చంద్రశేఖర్, గణేష్, సంతోష్ తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .