గాంధీ ఆసుపత్రిలో సరోజినీ ఫౌండేషన్ అన్నదానం
ముషీరాబాద్, ఫిబ్రవరి 12 (తెలంగాణ ముచ్చట్లు):
సరోజినీ ఫౌండేషన్ వ్యవస్థాపకులు, అధ్యక్షులు పి. కాంతారావు ఆధ్వర్యంలో ప్రతినెలా నిర్వహిస్తున్న అన్నదాన కార్యక్రమం భాగంగా గాంధీ ఆసుపత్రిలో సేవా కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పేద రోగులు, వారి సహాయకులు మరియు వృద్ధులకు పండ్లు, తాగునీటి బాటిళ్లు పంపిణీ చేశారు. పి. కాంతారావు స్వయంగా రోగులను పరామర్శిస్తూ వారి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకుని, అవసరమైన సహాయం అందిస్తామని తెలిపారు.సమాజంలో ఆర్థికంగా బలహీన వర్గాలకు తోడ్పాటు అందించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని ఆయన పేర్కొన్నారు. సరోజినీ ఫౌండేషన్ తరఫున ఇలాంటి సేవా
కార్యక్రమాలు నిరంతరం కొనసాగుతాయని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ సభ్యులు, స్వచ్ఛంద కార్యకర్తలు పాల్గొని సేవా కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఆసుపత్రి సిబ్బంది ఫౌండేషన్ చేపడుతున్న సేవలను అభినందించారు.


Comments