గాంధీ ఆసుపత్రిలో సరోజినీ ఫౌండేషన్ అన్నదానం

గాంధీ ఆసుపత్రిలో సరోజినీ ఫౌండేషన్ అన్నదానం

ముషీరాబాద్, ఫిబ్రవరి 12 (తెలంగాణ ముచ్చట్లు):

సరోజినీ ఫౌండేషన్ వ్యవస్థాపకులు, అధ్యక్షులు పి. కాంతారావు ఆధ్వర్యంలో ప్రతినెలా నిర్వహిస్తున్న అన్నదాన కార్యక్రమం భాగంగా గాంధీ ఆసుపత్రిలో సేవా కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పేద రోగులు, వారి సహాయకులు మరియు వృద్ధులకు పండ్లు, తాగునీటి బాటిళ్లు పంపిణీ చేశారు. పి. కాంతారావు స్వయంగా రోగులను పరామర్శిస్తూ వారి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకుని, అవసరమైన సహాయం అందిస్తామని తెలిపారు.సమాజంలో ఆర్థికంగా బలహీన వర్గాలకు తోడ్పాటు అందించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని ఆయన పేర్కొన్నారు. సరోజినీ ఫౌండేషన్ తరఫున ఇలాంటి సేవాIMG-20260212-WA0086 కార్యక్రమాలు నిరంతరం కొనసాగుతాయని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ సభ్యులు, స్వచ్ఛంద కార్యకర్తలు పాల్గొని సేవా కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఆసుపత్రి సిబ్బంది ఫౌండేషన్ చేపడుతున్న సేవలను అభినందించారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

బీజేపీ విధానాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్త సమ్మె – వనపర్తిలో భారీ నిరసన ర్యాలీ బీజేపీ విధానాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్త సమ్మె – వనపర్తిలో భారీ నిరసన ర్యాలీ
వనపర్తి,ఫిబ్రవరి12(తెలంగాణ ముచ్చట్లు): కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న ఉద్యోగ, కార్మిక, రైతు వ్యతిరేక విధానాలకు నిరసనగా దేశవ్యాప్తంగా నిర్వహించిన సమ్మెకు మద్దతుగా వనపర్తి జిల్లా కేంద్రంలో కార్మిక...
కల్లూరు మున్సిపల్ ఓట్ల లెక్కింపుకు పటిష్ట భద్రతా ఏర్పాట్లు.
రాధిక చౌరస్తాలో ఆటో కార్మికుల భారీ నిరసన
హరిత ఎంక్లేవ్‌లో మురుగునీటి సమస్యపై స్వర్ణరాజ్ శివమణి పర్యటన
హరిత ఎంక్లేవ్‌లో మురుగునీటి సమస్యపై స్వర్ణరాజ్ శివమణి పర్యటన
బండారి రాజిరెడ్డి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహణ
ఓటమి భయంతో గిఫ్టుల వసూలు?